Movie News

నెట్ ఫ్లిక్స్‌లో విరాటపర్వం?

ఎగ్జిబిటర్లు తీవ్ర హెచ్చరికలు చేసినా.. అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినా అగ్ర నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గలేదు. తన నిర్మాణంలో తెరకెక్కిన మూడు చిత్రాల్లో ఒకదాన్ని ఇప్పటికే ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసేశారు. అదే.. నారప్ప. ఈ నెల 20న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో రూపొందించిన ‘దృశ్యం-2’, ‘విరాటపర్వం’ చిత్రాలను కూడా సురేష్ ఓటీటీలకు ఇచ్చేసినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే వాటి గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘దృశ్యం-2’ ప్రైమ్ లేదా హాట్ స్టార్‌లో రావచ్చని అంటున్నారు. కాగా ‘విరాటపర్వం’ మీద ముందు నుంచి ఒక స్పష్టత లేదు. ఆ చిత్రం థియేటర్లలోనే రిలీజవుతుందని కొందరు.. లేదు లేదు ఓటీటీ డీల్ విషయంలో చర్చలు తుది దశలో ఉన్నాయని.. అది కూడా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతోందని కొందరు అంటూ వచ్చారు.

కాగా తాజా సమాచారం ప్రకారం ‘విరాటపర్వం’కు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందట. దీన్ని స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలను కొంటుంటారు. ‘విరాటపర్వం’ నెట్ ఫ్లిక్స్ శైలికి తగ్గ సినిమా. ఈ చిత్రానికి మంచి రేటే ఇచ్చి కొనుగోలు చేశారని.. త్వరలోనే అనౌన్స్‌మెంట్ రాబోతోందని అంటున్నారు.

దీంతో పాటు ‘దృశ్యం-2’ సంగతి కూడా సురేష్ బాబు త్వరలోనే తేల్చేస్తారని చెబుతున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల రూపొందించిన ఈ చిత్రంలో సురేష్ తనయుడు రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించగా.. సాయిపల్లవి హీరోయిన్‌గా చేసింది. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించింది. మూడు దశాబ్దాల కిందట, నక్సలిజం నేపథ్యంలో నడిచే కథ ఇది. దీని టీజర్, ఇతర ప్రోమోలు చాలా ఇంటెన్స్‌గా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

This post was last modified on July 13, 2021 11:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

14 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

1 hour ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago