కొన్ని సినిమాలు రిలీజైనపుడు ఓ మోస్తరుగా ఆడుతుంటాయి. కమర్షియల్గా మరీ పెద్ద సక్సెస్ ఏమీ సాధించవు. కానీ కాల క్రమంలో అవి క్లాసిక్స్ లాగా నిలిచిపోతాయి. చూడగా చూడగా ప్రేక్షకులకు అవి బాగా నచ్చేస్తాయి. వాటి గొప్పదనం లేటుగా అర్థమవుతుంది.
నాని సినిమా ‘జెర్సీ’ ఈ కోవకే చెందుతుంది. ‘మళ్ళీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల కిందట విడుదలైంది. ఆ సినిమా ఆ సమయానికి హిట్టే అయింది కానీ.. దాని స్థాయికి పెద్ద బ్లాక్బస్టర్ కావాల్సిందని అంటారు జనాలు.
ఓటీటీలో, టీవీలో ఈ సినిమాకు గొప్ప స్పందనే వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో ‘జెర్సీ’ పేరుతోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా దిల్ రాజు, కరణ్ జోహార్ నిర్మాణంలో గౌతమే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే దాని తర్వాత గౌతమ్ చేసే సినిమా గురించి ఇప్పటిదాకా రకరకాల ఊహాగాలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు.
ఐతే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మళ్లీ నానితో ఓ సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే క్లాసిక్ కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా ఈసారి ఓ సైనికుడి కథను ఉద్వేగభరితంగా చెప్పడానికి గౌతమ్ సిద్ధమవుతున్నాడట. యుద్ధ రంగంలో పోరాడి తన కాళ్లు పోగొట్టుకున్న ఓ వీర సైనికుడి కథ ఇదట. ‘
జెర్సీ’ తరహాలోనే కథలో చాలా వరకు ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుందని.. ‘జెర్సీ’ని మించి ఇందులో భావోద్వేగాలకు అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
‘జెర్సీ’ హిందీ రీమేక్ అయ్యాక రామ్ చరణ్తో గౌతమ్ సినిమా ఉంటుందని గట్టిగానే ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. చరణ్.. శంకర్తో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ‘అంటే సుందరానికి’ సినిమాలో నటిస్తున్నారు. అతను నటించిన ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 12, 2021 3:24 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…