తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సనమ్ శెట్టి తెలుగులో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తరువాత ‘సింగం 123’, ‘ప్రేమికుడు’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే కొన్ని నెలలుగా ఈమెని ఓ ఆకతాయి వేధిస్తున్నాడు. మొదట్లో ఈ వేధింపులను ఆమె పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఆమెని, ఆమె కుటుంబాన్ని చంపేస్తానంటూ అతడు బెదిరిస్తుండడంతో సనమ్ శెట్టి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది ఈ భామ.
గత కొన్నాళ్లుగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో దారుణమైన మెసేజ్ లు వస్తున్నాయని.. మొదట వాటిని పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ఏకంగా తన ఫోన్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ లు పంపిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను కూడా సేకరించినట్లు అనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే లైట్ తీసుకోవద్దని.. బయటకు చెప్పి సాయం తీసుకోవాలని సూచించింది.
ఇలా చేయడం వలన వేరే వాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చింది. సనమ్ శెట్టి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాయ్ జాన్ పాల్ గా గుర్తించారు. అయితే అతడు ఒక్కడే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడా..? లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. అలానే ఇన్ని రోజులుగా తనకు ధైర్యం చెబుతూ తోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
This post was last modified on July 9, 2021 8:56 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…