Movie News

పూజా హెగ్డే రూటే వేరు


కెరీర్ ఆరంభంలో కొంచెం చిన్న స్థాయి, మీడియం రేంజ్ సినిమాలు చేసినప్పటికీ.. పెద్ద హీరోయిన్ అయ్యాక మాత్రం ప్రతి సినిమాకూ రేంజ్ ఉండేలా చూసుకుంటారు హీరోయిన్లు. ఒకసారి పెద్ద హీరోలతో జత కట్టడం మొదలయ్యాక మళ్లీ చిన్న, మీడియం రేంజ్ హీరోల వైపు చూడరు. కెరీర్ కొంచెం డౌన్ అయ్యాక కానీ మళ్లీ లీగ్ మార్చరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. పూజా హెగ్డే ఆ కోవలోకే వస్తుంది.

‘డీజే’ సినిమాతో తెలుగులో మాంచి క్రేజ్ తెచ్చుకుని వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజా. వరుసగా ఆమె జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో జట్టు కడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ ఒక రేంజ్ ఉన్నవే. ఐతే అవి చేస్తూనే అఖిల్ లాంటి చిన్న స్థాయి హీరోతో లో బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో కథానాయికగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమా మొదలయ్యే సమయంతో పోలిస్తే ఆ తర్వాత పూజా రేంజ్ ఇంకా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో డిమాండ్ ఇంకా పెరిగింది. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ లాంటి సూపర్ స్టార్లతో ఆమె సినిమాలు చేస్తుండటం విశేషం. ఇలాంటి టైంలో తెలుగులో తన రేంజ్‌తో పోలిస్తే చాలా తక్కువ అయిన నితిన్‌తో సినిమా చేయడానికి పూజా రెడీ అవుతుండటం విశేషం.

చెక్, రంగ్‌దె లాంటి ఫ్లాపులతో వెనుకబడిపోయిన నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా కథానాయికగా నటించనుందట. ముందు ఈ చిత్రానికి కథానాయికగా రష్మిక మందన్నా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి పూజానే వచ్చిందట. ఆమెతో ఈ చిత్రానికి అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూ ఇలాంటి మిడ్ రేంజ్ మూవీ సంతకం చేయడం ద్వారా తన రూటే వేరని పూజా చాటిచెబుతోంది.

This post was last modified on July 7, 2021 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago