కెరీర్ ఆరంభంలో కొంచెం చిన్న స్థాయి, మీడియం రేంజ్ సినిమాలు చేసినప్పటికీ.. పెద్ద హీరోయిన్ అయ్యాక మాత్రం ప్రతి సినిమాకూ రేంజ్ ఉండేలా చూసుకుంటారు హీరోయిన్లు. ఒకసారి పెద్ద హీరోలతో జత కట్టడం మొదలయ్యాక మళ్లీ చిన్న, మీడియం రేంజ్ హీరోల వైపు చూడరు. కెరీర్ కొంచెం డౌన్ అయ్యాక కానీ మళ్లీ లీగ్ మార్చరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. పూజా హెగ్డే ఆ కోవలోకే వస్తుంది.
‘డీజే’ సినిమాతో తెలుగులో మాంచి క్రేజ్ తెచ్చుకుని వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజా. వరుసగా ఆమె జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో జట్టు కడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ ఒక రేంజ్ ఉన్నవే. ఐతే అవి చేస్తూనే అఖిల్ లాంటి చిన్న స్థాయి హీరోతో లో బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో కథానాయికగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సినిమా మొదలయ్యే సమయంతో పోలిస్తే ఆ తర్వాత పూజా రేంజ్ ఇంకా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో డిమాండ్ ఇంకా పెరిగింది. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ లాంటి సూపర్ స్టార్లతో ఆమె సినిమాలు చేస్తుండటం విశేషం. ఇలాంటి టైంలో తెలుగులో తన రేంజ్తో పోలిస్తే చాలా తక్కువ అయిన నితిన్తో సినిమా చేయడానికి పూజా రెడీ అవుతుండటం విశేషం.
చెక్, రంగ్దె లాంటి ఫ్లాపులతో వెనుకబడిపోయిన నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా కథానాయికగా నటించనుందట. ముందు ఈ చిత్రానికి కథానాయికగా రష్మిక మందన్నా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి పూజానే వచ్చిందట. ఆమెతో ఈ చిత్రానికి అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూ ఇలాంటి మిడ్ రేంజ్ మూవీ సంతకం చేయడం ద్వారా తన రూటే వేరని పూజా చాటిచెబుతోంది.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…