Movie News

పూజా హెగ్డే రూటే వేరు


కెరీర్ ఆరంభంలో కొంచెం చిన్న స్థాయి, మీడియం రేంజ్ సినిమాలు చేసినప్పటికీ.. పెద్ద హీరోయిన్ అయ్యాక మాత్రం ప్రతి సినిమాకూ రేంజ్ ఉండేలా చూసుకుంటారు హీరోయిన్లు. ఒకసారి పెద్ద హీరోలతో జత కట్టడం మొదలయ్యాక మళ్లీ చిన్న, మీడియం రేంజ్ హీరోల వైపు చూడరు. కెరీర్ కొంచెం డౌన్ అయ్యాక కానీ మళ్లీ లీగ్ మార్చరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. పూజా హెగ్డే ఆ కోవలోకే వస్తుంది.

‘డీజే’ సినిమాతో తెలుగులో మాంచి క్రేజ్ తెచ్చుకుని వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజా. వరుసగా ఆమె జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో జట్టు కడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ ఒక రేంజ్ ఉన్నవే. ఐతే అవి చేస్తూనే అఖిల్ లాంటి చిన్న స్థాయి హీరోతో లో బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో కథానాయికగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమా మొదలయ్యే సమయంతో పోలిస్తే ఆ తర్వాత పూజా రేంజ్ ఇంకా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో డిమాండ్ ఇంకా పెరిగింది. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ లాంటి సూపర్ స్టార్లతో ఆమె సినిమాలు చేస్తుండటం విశేషం. ఇలాంటి టైంలో తెలుగులో తన రేంజ్‌తో పోలిస్తే చాలా తక్కువ అయిన నితిన్‌తో సినిమా చేయడానికి పూజా రెడీ అవుతుండటం విశేషం.

చెక్, రంగ్‌దె లాంటి ఫ్లాపులతో వెనుకబడిపోయిన నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా కథానాయికగా నటించనుందట. ముందు ఈ చిత్రానికి కథానాయికగా రష్మిక మందన్నా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి పూజానే వచ్చిందట. ఆమెతో ఈ చిత్రానికి అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూ ఇలాంటి మిడ్ రేంజ్ మూవీ సంతకం చేయడం ద్వారా తన రూటే వేరని పూజా చాటిచెబుతోంది.

This post was last modified on July 7, 2021 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

24 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago