Movie News

ప్రభాస్ 20.. ఎన్నాళ్లీ సస్పెన్స్?

ప్రభాస్ గత సినిమా ‘సాహో’కు మ్యూజిక్ విషయంలో ఎంత సందిగ్ధత నడిచిందో తెలిసిందే. ముందు ఆ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్‌లను సంగీత దర్శకులుగా ఎంపిక చేశారు. కానీ వారి ఔట్ పుట్ నచ్చకో ఇంకేదైనా కారణంతోనే చివరి దశలో తప్పుకున్నారు. విడుదలకు కొన్ని నెలల ముందు ఇది జరిగింది.

దీంతో అప్పటికప్పుడు ఏదో హడావుడిగా వేర్వేరు సంగీత దర్శకులతో పాటలు చేయించుకున్నారు. టీజర్లకు సాయం పట్టిన జిబ్రాన్‌తోనే బ్యాగ్రౌండ్ స్కోర్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన యువి క్రియేషన్స్ వాళ్లే ప్రభాస్ కొత్త చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఐతే ‘సాహో’ అనుభవం నేపథ్యంలో దీనికైనా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో జాగ్రత్త పడతారేమో అనుకుంటే అదేమీ జరగలేదు. సినిమా చిత్రీకరణ 80 శాతం దాకా పూర్తయిందంటున్నారు. కానీ ఇప్పటిదాకా సంగీత బాధ్యతలు ఎవరివన్నదానిపై సమాచారం లేదు.

‘సాహో’తో పోలిస్తే ప్రభాస్ కొత్త సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది ప్రేమకథా చిత్రం. మంచి ఫీల్ ఉన్న పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అవసరం. ఎక్కువ రోజులు మనసు పెట్టి పని చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు ముందే సంగీత దర్శకుడిని ఖరారు చేసుకోవాల్సింది. కానీ అలాంటిదేమీ జరిగినట్లు లేదు. మధ్యలో ‘సైరా’ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పేరు వినిపించింది కానీ.. దానిపై ఏ సమాచారం లేదు. ఈ చిత్ర పీఆర్వోలు కూడా సంగీత దర్శకుడెవరో స్పష్టత లేదనే అంటున్నారు.

మరి చిత్ర బృందం ఉద్దేశమేంటో అర్థం కావడం లేదు. ‘సాహో’ మాదిరే నాన్చి నాన్చి చివర్లో ఎవరో ఒకరితో హడావుడిగా పని చేయించి పాటల్ని చెడగొడతారేమో అన్న ఆందోళన ప్రభాస్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు లాక్ డౌన్ పూర్తయ్యాక మంచి ముహూర్తం చూసుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

This post was last modified on May 22, 2020 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago