టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠికి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. ఈ ఏడాది ఆమె నటించిన ‘చావు కబురు చల్లగా’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అయినప్పటికీ కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తుంది.
ఇప్పటికే కొన్ని షాపింగ్ మాల్స్ కి సంబంధించిన యాడ్స్, అలానే హెర్బల్ హెయిర్ ఆయిల్ యాడ్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ యాడ్ కొట్టేసిందట. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. బుల్లితెరపై పలు యాడ్స్ లో కనిపిస్తూనే ఉంటారు. చాలా ఉత్పత్తులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకటి గోల్డ్ విన్నర్ ఆయిల్ బ్రాండ్.
ఇప్పటికీ టీవీల్లో ఈ యాడ్ వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మహేష్ కి బదులుగా ఆ యాడ్ కోసం లావణ్య త్రిపాఠిని ఎన్నుకున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. సూపర్ స్టార్ ప్రాతినిధ్యం వహించిన బ్రాండ్ ఇప్పుడు లావణ్య చేతుల్లోకి వచ్చిందంటే బ్రాండ్ సర్క్యూట్ లో ఆమెకి ఇది పెద్ద స్టెప్ అనే చెప్పాలి. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని బ్రాండ్స్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి!
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…