టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా తక్కువగా ప్రేమకథలు చేసిన హీరో ఎన్టీఆరే. కెరీర్ ఆరంభంలోనే వయసుకు మించిన పాత్రలతో తిరుగులేని మాస్ ఇమేజ్ రావడంతో తారక్ ప్రేమకథల జోలికి పెద్దగా వెళ్లలేదు. అతడిపై మాస్ ముద్ర పడిపోవడంతో పూర్తి స్థాయి ప్రేమకథ చేయడానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రేమకథలు చేసే వయసు కూడా దాటిపోవడంతో ఇక మళ్లీ ఆ జానర్లో నటించే అవకాశమే ఉండదని ఫిక్సయిపోయారంతా. కానీ తమిళ దర్శకుడు అట్లీ తారక్ను ఓ ప్రేమకథలో చూపించబోతున్నాడన్నది తాజా సమాచారం.
అట్లీతో తారక్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. కలిసి సినిమా చేయడానికి వీళ్లిద్దరూ ఆసక్తిగానే ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ కాంబినేషన్ సెట్ కావచ్చన్ని చాన్నాళ్లుగానే ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇద్దరూ వేర్వేరు కమిట్మెంట్లతో ఉండటంతో సినిమా ఆలస్యం అవుతోంది. ఐతే తాజాగా ఈ కాంబోలో సినిమా దిశగా కదలిక వచ్చినట్లు సమాచారం. ఇటీవలే అట్లీ తారక్కు ఓ కథ చెప్పాడట. అది అట్లీ తొలి సినిమా రాజా రాణి తరహాలో ఎమోషనల్ లవ్ స్టోరీ అట. కొంచెం యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నాడట అట్లీ. స్టోరీ లైన్ తారక్కు బాగా నచ్చిందని, బౌండ్ స్క్రిప్టుతో రావాలని అట్లీకి చెప్పాడని సమాచారం.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న ఎన్టీఆర్.. తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ఈలోపు అట్లీ.. షారుఖ్ ఖాన్ సినిమాను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరి కలయికలో సినిమా రావడానికి ఛాన్సుంది. మరి 40వ పడికి చేరువ అవుతున్న దశలో తనకు పెద్దగా పట్టులేని లవ్ స్టోరీ జానర్లో తారక్ ఎలా మెప్పిస్తాడో.. అతణ్ని అట్లీ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on July 6, 2021 11:02 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…