Movie News

నీ పని నువ్వు చూస్కో.. హీరో సూర్యకు బీజేపీ వార్నింగ్

తమిళ హీరోలకూ, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి మధ్య రోజుకో కొత్త వివాదం పుట్టుకొస్తోంది. మొన్నటికి మొన్న హీరో సిద్ధార్థ్, బీజేపీ నేతలకు మధ్య ట్వీట్ వార్ జరిగింది.. ఇప్పుడు హీరో సూర్యతో.. ఇలాంటి వివాదాలే మొదలయ్యాయి. దాదాపు తన పనేంటో తాను చేసుకుంటూ.. ఎవరితోనూ ఎలాంటి వివాదం పెట్టుకోని.. హీరో సూర్యకి బీజేపీ నేతలు వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

సూర్యకి ఎవరితోనూ వివాదాలు లేకపోయినా.. ప్రభుత్వ నిర్ణయాలను మాత్రం అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. గతంలో..నీట్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై కోర్టు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టి వార్త‌ల్లోకెక్కారు సూర్యా. తాజాగా కేంద్రం సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టం-1952 స‌వ‌రించాలని నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని సినీ ప్ర‌ముఖులు తీవ్రంగా విబేధిస్తుండ‌గా సూర్య కూడా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు మ‌రింత మ‌ద్ద‌తివ్వాలే కానీ.. దానికి సంకెళ్లు వేసేలా ఉండొద్ద‌ని హిత‌వు ప‌లికారు. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తమిళనాడు బీజేపీ యువ‌జ‌న విభాగం తీవ్రంగా స్పందించింది.

సూర్య ప‌ని సినిమాల్లో న‌టించ‌డ‌మేన‌ని.. ఆయ‌న దాన్ని చూసుకుంటే బాగుంటుంద‌ని సూచించింది. త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించింది. సూర్య త‌న‌ తీరు మార్చుకోక‌పోతే ఆయ‌నపై న్యాయ‌ప‌ర‌మైన పోరాటం చేస్తామ‌ని చెప్పింది. అయితే బీజేపీ యువ‌జన విభాగం చేసిన వ్యాఖ్య‌లు అతిగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న మాట్లాడిన దాంట్లో త‌ప్పేముంద‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on July 6, 2021 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago