Movie News

మెహ్రీన్‌ నుంచి విడిపోవడంపై అతనేమన్నాడంటే..

కొన్నేళ్ల కిందట సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష.. వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకోవడం.. కొంత కాలం అతడితో కలిసున్నాక ఉన్నట్లుండి నిశ్చితార్థం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. నిశ్చితార్థం రద్దయ్యాక త్రిష పేరెత్తకుండా ఆమెనుద్దేశించి నెగెటివ్ కామెంట్లు చేయడం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ఇదే తరహాలో సౌత్‌లో ఫేమస్ అయిన మరో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.. పొలిటీషియన్ అయిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుని.. కొన్ని నెలలకే దాన్ని రద్దు చేసుకుంది. వీళ్ల మధ్య తీవ్ర విభేదాలే వచ్చాయని.. అందుకే విడిపోయారని అంటున్నారు. తాజాగా మెహ్రీన్ పెట్టిన ఒక పోస్టు భవ్యను ఉద్దేశించే అని భావిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తే భవ్య, అతడి కుటుంబం ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మెహ్రీన్‌తో నిశ్చితార్థం రద్దవడంపై భవ్య కూడా స్పందించాడు. ఆమెను తానెంతో ప్రేమించానని.. కానీ తామిద్దరం కలిసి సాగలేకపోయామని అతనన్నాడు. మెహ్రీన్‌ నుంచి విడిపోవడం పట్ల తానేమీ చింతించట్లేదని అతను వ్యాఖ్యానించడం గమనార్హం.

“మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని జులై 1నే మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మెహ్రీన్‌ పరిచయమైన నాటి నుంచి ఆమెను ఎంతో ప్రేమించాను. ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాను. మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందని భావించాను. కానీ కాలం మా జీవితాలను వేరు చేసింది. మెహ్రీన్‌ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు. నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను” అని భవ్య పేర్కొన్నాడు. మెహ్రీన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులను తాను ఎప్పుడూ ఉన్నతంగానే చూశానని భవ్య అన్నాడు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

6 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

6 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

7 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

7 hours ago