Movie News

ఫస్ట్ లుక్ రాలేదు.. బిజినెస్ మొత్తం ఫినిష్


తమిళంలో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్లంటే విజయ్, అజిత్‌లే. ఈ ఇద్దరూ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించి ఎదిగిపోయారు. రజినీ సినిమాలను మించి వీరి చిత్రాలకు బిజినెస్ జరుగుతోంది. వాళ్ల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బద్దలైపోతున్నాయి. అజిత్ నుంచి రెండేళ్ల కిందట వచ్చిన ‘విశ్వాసం’ సగటు మాస్ మసాలా మూవీనే. కానీ అది అప్పటికి ఉన్న తమిళనాడు వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేయడం విశేషం. దీని తర్వాత ‘పింక్’ రీమేక్ ‘నీర్కొండ పార్వై’ కూడా మంచి విజయమే సాధించింది.

ఐతే అజిత్‌ను పూర్తి స్థాయి యాక్షన్ మూవీలో చూడాలన్న అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే అతను ‘వాలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కార్తితో ‘ఖాకి’ సినిమా.. అలాగే అజిత్‌తో ‘నీర్కొండ పార్వై’ తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మాత. తెలుగు నటుడు కార్తికేయ ఇందులో విలన్ పాత్ర చేస్తుండటం విశేషం.

కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ‘వాలిమై’కి సంబంధించి ఇప్పటిదాకా అఫీషియల్‌గా ఒక్క అప్ డేట్ లేదు. కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. ‘వాలిమై’ అనే టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఐతేనేం ఈ సినిమాపై క్రేజ్ పీక్స్‌లో ఉంది. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఎంత భరోసా ఉందంటే.. ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ కాకుండానే టోటల్ బిజినెస్ పూర్తయిపోయిందట. థియేట్రికల్ హక్కులు అమ్మేశాడు. డిజిటల్ డీల్స్ పూర్తయ్యాయి. అలాగే శాటిలైట్ హక్కులను కూడా అమ్మేశారట.

అజిత్ ఒక సినిమాను అనౌన్స్ చేయడమే ఆలస్యం.. డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్‌లు పట్టుకుని నిర్మాత దగ్గర వాలిపోతుంటారు. అందులోనూ అతను వరుస విజయాలతో దూకుడు మీదుండటం.. క్రేజీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుండటంతో ‘వాలిమై’పై అంచనాలు మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. రూ.200 కోట్లకు పైగానే ఈ చిత్రానికి బిజినెస్ జరిగిందని.. బోనీ కపూర్ ఈ చిత్రంతో భారీగా వెనకేసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ‘వాలిమై’ ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on July 4, 2021 2:54 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago