2020 చివర్లో జరిగిన నిర్భయ రేప్ ఉదంతం ఎంతగా సంచలనం రేపిందో.. దేశాన్ని ఏ స్థాయిలో కుదిపేసిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ దారుణం గురించి తెలిసి కదిలిపోయిన దేశ యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చి ఆందోళన నిర్వహించింది. ఇలాంటి దారుణాలకు అడ్డు కట్ట వేసేందుకు నిర్భయ పేరుతో ఒక చట్టం కూడా తెచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆ ఉదంతం దేశంపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు ఉరిశిక్ష అమలు చేసే విషయంలో ఎంత ఆలస్యం జరిగిందో.. బాధితురాలి తల్లిదండ్రులు ఎలాంటి మానసిక వేదన అనుభవించారో తెలిసిందే. చివరికి కొన్ని నెలల కిందటే ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష అమలైంది. భారతీయులపై అత్యంత ప్రభావం చూపిన ఈ కేసుపై సమగ్ర అధ్యయనంతో ఇప్పుడో వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే.. ఢిల్లీ క్రైమ్.
నెట్ ఫ్లిక్స్లో తాజాగా ఈ వెబ్ సిరీస్ను లాంచ్ చేశారు. ఆ రోజు రాత్రి నిర్భయపై దారుణం జరగడానికి ముందు పరిస్థితులేంటి.. ఆ దారుణం ఎలా బయటపడింది.. తర్వాత బాధితురాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది.. తన చివరి మాటలు ఏంటి.. ఆపై నిందితుల్ని కనుగొనేందుకు పోలీసులు ఏం చేశారో.. అందరినీ ఎలా బయటికి లాగారు.. కేసు విచారణ ఎలా సాగింది.. యువత ఎలా రగిలిపోయారో.. నిందితులకు ఉరి శిక్ష అమలులో ఎందుకు జాప్యం జరిగింది.. ఈ విషయంలో రాజకీయాల ప్రమేయం ఏంటి.. చివరికి ఎలా ఉరిశిక్ష అమలైంది.. ఇత్యాది అంశాలన్నింటిపై సమగ్ర పరిశోధనతో ఈ సిరీస్ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
‘ఢిల్లీ క్రైమ్’కు మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. కొంచెం స్లో అన్న కంప్లైంట్ మినహాయిస్తే సిరీస్ ఉద్వేగభరితంగా, ఉత్కంఠతో సాగుతుందని అంటున్నారు. చూడదగ్గ సిరీస్ ఇదంటున్నారు.
This post was last modified on May 21, 2020 1:33 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…