మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కొన్ని రోజులుగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండగానే.. ఈ లోపే వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్తో పాటు మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నరసింహారావు, ఒ.కళ్యాణ్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్, విష్ణు, సీవీఎల్ ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మిగతా వాళ్ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధ్యక్ష పదవికి పోటీ పడటంపై ఆలోచిస్తున్నానని.. ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని జీవిత అన్నారు. ఆమె పోటీ చేయడం దాదాపు ఖాయం అంటున్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ పెద్దల్లో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి.. ప్రకాష్ రాజ్ను సపోర్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు. చిరు సోదరుడు నాగబాబు ఈ విషయంపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
చిరు తర్వాత అందరూ మద్దతు పరంగా ఆలోచించేది నందమూరి బాలకృష్ణ గురించే. ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తారన్నది ఉత్కంఠభరితంగా మారింది. చిరు.. ప్రకాష్ రాజ్ను సపోర్ట్ చేసిన నేపథ్యంలో బాలయ్య మంచు విష్ణు లేదా జీవితకు మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఐతే ఆయన జీవిత వైపే ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
గత ఏడాది ‘మా’కు సంబంధించిన ఓ సన్నివేశంలో రాజశేఖర్పై చిరు ఆగ్రహం వ్యక్తం చేయడం, అప్పట్నుంచి ఆయన ‘మా’ కార్యకలాపాలకు దూరంగా ఉండటం తెలిసిందే. రాజశేఖర్కు చిరుతో ముందు నుంచి అభిప్రాయ భేదాలున్నాయి. ఈ నేపథ్యంలో చిరును వ్యతిరేకించే జీవిత, రాజశేఖర్ల వైపు బాలయ్య నిలవబోతున్నాడని.. జీవితకు ఆయన బహిరంగ మద్దతు ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ‘మా’లో తాము చేపట్టిన కొన్ని కార్యక్రమాలు కూడా తమకు కలిసొస్తాయని, బాలయ్య మద్దతు కూడా లభిస్తే ఎన్నికల్లో గెలవడానికి మంచి అవకాశాలుంటాయని జీవిత యోచిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 30, 2021 2:48 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…