ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అన్నట్లుగా చూస్తుంది మిగతా ప్రపంచం. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో జనాలు మాట్లాడే హిందీ భాషలో సినిమాలు తీస్తూ పెద్ద మార్కెట్ను కలిగి ఉన్న బాలీవుడ్ ముందు ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసి ఒక్కో రాష్ట్రానికి పరిమితం అయిన టాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలు కొంచెం చిన్నవిగానే కనిపించేవి ఇంతకుముందు. కానీ సౌత్ ప్రేక్షకులకు సినిమా అభిమానం ముందు హిందీ వాళ్ల సినీ ప్రేమ చిన్నదే.
ముఖ్యంగా తెలుగు, తమిళ అభిమానుల సినిమా పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. తమకు మంచి వినోదాన్నందించే సినిమాలు తీస్తే వాటిని ఎలా నెత్తిన పెట్టుకుంటారో, ఏ స్థాయి విజయాన్నందిస్తారో చెప్పడానికి ఎన్నో రుజువులున్నాయి. కాగా మన సినిమాల ప్రమాణాలు కూడా గత కొన్నేళ్లలో ఎంతగానో పెరిగి.. బాలీవుడ్ కూడా టాలీవుడ్ ముందు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ రేంజే మారిపోయింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ సినిమాలకు వస్తున్న బిజినెస్ ఆఫర్లు, వాటి డీల్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. వాటి ముందు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాలు వెలవెలబోతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సంగతే తీసుకుంటే.. కేవలం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే రూ.350 కోట్ల దాకా ఆదాయం తెచ్చుకుందీ చిత్రం. ఇక థియేట్రికల్ రైట్స్ కూడా కలిపితే బిజినెస్ లెక్క రూ.800 కోట్లను దాటేలా ఉంది.
ఇక ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.200 కోట్లకు పైగానే పలికినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ.500 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక కన్నడ ప్రధానంగా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్-2’కు కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాల ముందు బాలీవుడ్ సినిమాలు అస్సలు నిలిచే పరిస్థితి లేదు. అక్కడి సూపర్ స్టార్ల సినిమాలకు కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే సగం బిజినెస్ జరగడం కష్టంగా ఉంది. మున్ముందు టాలీవుడ్, ఇతర సౌత్ ఇండస్ట్రీల నుంచి మరిన్ని భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ వాటి ముందు నిలిచే పరిస్థితే కనిపించడం లేదు.
This post was last modified on July 7, 2021 10:57 am
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…