గత ఏడాది కరోనా టైంలో చాలామంది సినీ ప్రముఖులు కాలం చేశారు. అందులో సినీ ప్రేక్షకులను చాలా బాధ పెట్టిన మరణాల్లో ఇర్ఫాన్ ఖాన్ది ఒకటి. ఐతే ఆయన మరణించింది కరోనాతో కాదు. ఒక అరుదైన క్యాన్సర్ బారిన పడి కొన్నేళ్ల పాటు పోరాడిన ఇర్ఫాన్.. గత ఏడాది కన్నుమూశాడు. ఇర్ఫాన్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్నాడతను. చాలామంది సినీ ప్రముఖుల్లాగే ఆయన కూడా తన కొడుకు బబిల్ ఖాన్ను నటనలోకి తేవాలనుకున్నాడు. టీనేజీలో ఉండగానే ఫిల్మ్ కోర్సులు చేయడానికి అతణ్ని విదేశాలకు కూడా పంపించాడు. ఐతే అప్పుడే ఇర్ఫాన్ అనారోగ్యం పాలయ్యాడు. తండ్రి అనారోగ్యం తాలూకు బాధను తట్టుకుంటూనే బబిల్ కోర్సులు పూర్తి చేశాడు.
గత ఏడాది తండ్రి చనిపోయిన టైంలో అతను స్వదేశానికి వచ్చి కొన్ని నెలలు తల్లి దగ్గర ఉన్నాడు. తిరిగి ఫారిన్కు వెళ్లిపోయాడు. ఇప్పుడు కోర్సు పూర్తి చేసుకుని ముంబయికి వచ్చేసిన అతడికి ఒక మంచి ప్రాజెక్టు స్వాగతం పలకడం విశేషం. నెట్ఫ్లిక్స్ నిర్మించబోయే ‘ఖాలా’ అనే చిత్రంలో బబిల్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. అతడికి జోడీగా ‘బుల్ బుల్’ ఫేమ్ తృప్తి దిమ్రి నటించనుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన సూర్జిత్ సిర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
విక్కీ డోనర్, పీకూ, అక్టోబర్ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సూర్జిత్కు ఇర్ఫాన్తో మంచి అనుబంధమే ఉంది. వీళ్లిద్దరూ కలిసి ‘పీకూ’కు పని చేశారు. ఇప్పుడు ఇర్ఫాన్ కొడుకును అతనే నటుడిగా పరిచయం చేస్తున్నాడు. లుక్స్ పరంగా బబిల్ యావరేజ్గా అనిపిస్తున్నప్పటికీ.. నటనలో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటాడేమో చూడాలి.
This post was last modified on June 28, 2021 3:10 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…