మాస్ రాజా కెరీర్లో బ్యాడ్ ఫేజ్ కొనసాగుతూనే ఉంది. అతను చివరగా ‘రాజా ది గ్రేట్’తో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఏ సినిమా ఆడలేదు. దానికి ముందు కూడా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. గత మూడేళ్లలో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ లాంటి పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు.
చివరగా వచ్చిన ‘డిస్కో రాజా’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. ప్రస్తుతం అతడి ఆశలన్నీ ‘క్రాక్’ మీదే ఉన్నాయి. ఆ సినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న నేపథ్యంలో తనకు బాగా అలవాటైన మాస్ సినిమాలే చేయడానికి పూనుకున్నాడు రవితేజ.
ఇందులో భాగంగానే రమేష్ వర్మతో ఓ మసాలా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మాస్ రాజా. రమేష్తో ‘రాక్షసుడు’ తీసిన కోనేరు సత్యనారాయణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కరోనా ప్రభావం మొదలవడానికి ముందు ఈ సినిమాకు అంగీకారం కుదిరింది. ఐతే లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు సమాచారం.
బడ్జెట్ సమస్యలతో ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్లుగా చెబుతున్నారు. స్క్రిప్టు మీద కూడా అంత భరోసా లేకపోవడం, రవితేజ మార్కెట్ కూడా బాగా దెబ్బ తిని ఉండటం, బడ్జెట్ విషయంలో తర్జన భర్జనలు నడుస్తుండటంతో ఈ సినిమాను ఆపేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారట. ఐతే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. లాక్ డౌన్ తర్వాత ఏ సంగతీ తేలే అవకాశముంది.
This post was last modified on May 21, 2020 8:26 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…