Movie News

మాస్ రాజా సినిమా క్యాన్సిల్?

మాస్ రాజా కెరీర్లో బ్యాడ్ ఫేజ్ కొనసాగుతూనే ఉంది. అతను చివరగా ‘రాజా ది గ్రేట్’తో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఏ సినిమా ఆడలేదు. దానికి ముందు కూడా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. గత మూడేళ్లలో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ లాంటి పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు.

చివరగా వచ్చిన ‘డిస్కో రాజా’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. ప్రస్తుతం అతడి ఆశలన్నీ ‘క్రాక్’ మీదే ఉన్నాయి. ఆ సినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న నేపథ్యంలో తనకు బాగా అలవాటైన మాస్ సినిమాలే చేయడానికి పూనుకున్నాడు రవితేజ.

ఇందులో భాగంగానే రమేష్ వర్మతో ఓ మసాలా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మాస్ రాజా. రమేష్‌తో ‘రాక్షసుడు’ తీసిన కోనేరు సత్యనారాయణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కరోనా ప్రభావం మొదలవడానికి ముందు ఈ సినిమాకు అంగీకారం కుదిరింది. ఐతే లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు సమాచారం.

బడ్జెట్ సమస్యలతో ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లుగా చెబుతున్నారు. స్క్రిప్టు మీద కూడా అంత భరోసా లేకపోవడం, రవితేజ మార్కెట్ కూడా బాగా దెబ్బ తిని ఉండటం, బడ్జెట్ విషయంలో తర్జన భర్జనలు నడుస్తుండటంతో ఈ సినిమాను ఆపేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారట. ఐతే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. లాక్ డౌన్ తర్వాత ఏ సంగతీ తేలే అవకాశముంది.

This post was last modified on May 21, 2020 8:26 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

4 hours ago