Movie News

మనోజ్.. సీక్రెట్‌గా ఏదో చేస్తున్నాడు

మంచు మనోజ్ కెరీర్లో ఊహించని విధంగా రెండేళ్ల విరామం వచ్చేసింది. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను సినిమానే చేయలేదు. ఎట్టకేలకు ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. మధ్యలో అతడి మాటలు, చర్యలు చూస్తే సినిమాలు పూర్తిగా మానేస్తాడేమో అనిపించింది. రాజకీయాల్లోకి వస్తాడన్న ఊహాగానాలు వినిపించాయి.
కొంతకాలం హైదరాబాద్ విడిచిపెట్టి.. తిరుపతిలోనూ ఉంటూ కొన్ని సేవా కార్యక్రమాలేవో చేపట్టాడు మనోజ్. తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చి సినిమాలపై దృష్టి పెట్టాడు. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాను ఓకే చేశాడు. దాని కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమాలా.. రాజకీయాలా.. ఇంకొకటా అని చెప్పకుండా తనకో డ్రీమ్ ప్రాజెక్టు ఉన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మనోజ్.

ఆ డ్రీమ్ ప్రాజెక్టు చాలా పెద్దదని.. దాని ఫలితాలు గొప్పగా ఉంటాయని.. ఇప్పటికే ఆ డ్రీమ్ ప్రాజెక్టు హైదరాబాద్‌లో మొదలుపెట్టానని.. దాన్ని తర్వాత తిరుపతికి విస్తరిస్తానని.. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని చెప్పాడు మనోజ్. దాని గురించి వివరాలు చెప్పడానికి మనోజ్ ఇష్టపడలేదు. వచ్చే ఏడాది దాని గురించి వెల్లడిస్తానని మనోజ్ చెప్పాడు. ఇంతకీ రాజకీయాల సంగతేంటి అని మనోజ్‌ను అడిగితే.. తనకు వాటిపై ఆసక్తి లేదని తేల్చేశాడు మనోజ్. ఇంతకుముందు తిరుపతికి వెళ్లి తాను చేపట్టిన కార్యక్రమం కూడా రాజకీయాలతో సంబంధం లేనిదే అని అతను తెలిపాడు.

తన కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’తో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు చెప్పిన మనోజ్.. సినిమాల నుంచి రెండేళ్లు విరామం తీసుకోవడానికి ఫెయిల్యూర్లు ఎంతమాత్రం కారణం కాదని, వ్యక్తిగత కారణాల వల్లే ఈ గ్యాప్ తీసుకున్నానని మనోజ్ స్పష్టం చేశాడు. ఓటీటీల వల్ల సినీ పరిశ్రమకు మంచిదే అని మనోజ్ అభిప్రాయపడ్డాడు.

This post was last modified on May 21, 2020 8:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago