జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా.. ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని ఎంతగానో ఆశించారు అభిమానులు. కానీ లాక్ డౌన్ కారణంగా జక్కన్న అండ్ టీం ప్రణాళికలు ఫలించలేదు. అరకొరగా ఏదో ఒకటి చేసి అసంతృప్తికి గురి చేయడం కన్నా.. అన్నీ సవ్యంగా ఉన్నపుడు పర్ఫెక్ట్గా టీజర్ తయారు చేసి రిలీజ్ చేయడమే మంచిదని చిత్ర బృందం భావించింది.
అందుకే అతడి పుట్టిన రోజున ఏ విశేషం ఉండబోదని తేల్చేసింది. ఐతే తారక్ పుట్టిన రోజు వెళ్లిపోయినా.. పరిస్థితులు అనుకూలిస్తే సాధ్యమైనంత త్వరగా అతడి పాత్రకు సంబంధించిన టీజర్ రలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
మరి కొన్ని వారాల్లోనే షూటింగులకు ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ఎలాగూ సినిమాను వచ్చే సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్న నేపథ్యంలో రిలీజ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. రెగ్యులర్ షూటింగ్ సంగతి అలా ఉంచితే ముందు తారక్ టీజర్కు సంబంధించిన కంటెంట్ రెడీ చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. చిత్రీకరణపై ఆంక్షలు కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మరి టీజర్ రిలీజ్ చేయడానికి తగ్గ సందర్భం ఏముంటుందా అని చూస్తే ఆగస్టు 15 లోపు ఏ అకేషన్ లేదు. ఐతే సందర్భం చూడకుండా కంటెంట్ రెడీ అవ్వగానే సాధ్యమైనంత త్వరగా దాన్ని రిలీజ్ చేసేయాలని చిత్ర బృందం డిసైడైపోయిందట. తారక్ అభిమానుల్ని ఎక్కువ రోజులు వెయిట్ చేయించకూడదన్న ఉద్దేశంతో ఇలా నిర్ణయించారట. కాబట్టి షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక కొన్ని వారాల్లోనే తారక్ టీజర్ రిలీజయ్యేందుకు అవకాశముంది.
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…