అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుటేజ్ ఎక్కువ వస్తుండడంతో రెండు భాగాలుగా సినిమా తీస్తే.. కథను మరింత బాగా చెప్పొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో బన్నీ కూడా దీనికి ఒప్పుకున్నారు.
కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ను మరికొద్ది రోజుల్లో పునః ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ లేదా మరో సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ‘ఐకాన్’ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలనుకుంటున్నారట.
అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పారట. కానీ ఆయన మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ పూర్తి చేస్తానని చెబుతున్నారట. కానీ సుకుమార్ మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తేనే ఒక ఫ్లో ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆసక్తి తగ్గి, షూటింగ్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో బన్నీను ఒప్పించే పనిలో పడ్డారు. మరి డైరెక్టర్-హీరో ఒకే మాట మీదకు వస్తారో లేదో చూడాలి!
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…