అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుటేజ్ ఎక్కువ వస్తుండడంతో రెండు భాగాలుగా సినిమా తీస్తే.. కథను మరింత బాగా చెప్పొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో బన్నీ కూడా దీనికి ఒప్పుకున్నారు.
కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ను మరికొద్ది రోజుల్లో పునః ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ లేదా మరో సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ‘ఐకాన్’ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలనుకుంటున్నారట.
అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పారట. కానీ ఆయన మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ పూర్తి చేస్తానని చెబుతున్నారట. కానీ సుకుమార్ మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తేనే ఒక ఫ్లో ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆసక్తి తగ్గి, షూటింగ్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో బన్నీను ఒప్పించే పనిలో పడ్డారు. మరి డైరెక్టర్-హీరో ఒకే మాట మీదకు వస్తారో లేదో చూడాలి!
This post was last modified on June 27, 2021 3:09 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…