Movie News

బన్నీను కన్విన్స్ చేస్తోన్న సుకుమార్!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుటేజ్ ఎక్కువ వస్తుండడంతో రెండు భాగాలుగా సినిమా తీస్తే.. కథను మరింత బాగా చెప్పొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో బన్నీ కూడా దీనికి ఒప్పుకున్నారు.

కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ను మరికొద్ది రోజుల్లో పునః ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ లేదా మరో సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ‘ఐకాన్’ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలనుకుంటున్నారట.

అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పారట. కానీ ఆయన మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ పూర్తి చేస్తానని చెబుతున్నారట. కానీ సుకుమార్ మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తేనే ఒక ఫ్లో ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆసక్తి తగ్గి, షూటింగ్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో బన్నీను ఒప్పించే పనిలో పడ్డారు. మరి డైరెక్టర్-హీరో ఒకే మాట మీదకు వస్తారో లేదో చూడాలి!

This post was last modified on June 27, 2021 3:09 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

22 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

39 mins ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

1 hour ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

1 hour ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

1 hour ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

2 hours ago