అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుటేజ్ ఎక్కువ వస్తుండడంతో రెండు భాగాలుగా సినిమా తీస్తే.. కథను మరింత బాగా చెప్పొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో బన్నీ కూడా దీనికి ఒప్పుకున్నారు.
కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ను మరికొద్ది రోజుల్లో పునః ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ లేదా మరో సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ‘ఐకాన్’ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలనుకుంటున్నారట.
అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పారట. కానీ ఆయన మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ పూర్తి చేస్తానని చెబుతున్నారట. కానీ సుకుమార్ మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తేనే ఒక ఫ్లో ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆసక్తి తగ్గి, షూటింగ్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో బన్నీను ఒప్పించే పనిలో పడ్డారు. మరి డైరెక్టర్-హీరో ఒకే మాట మీదకు వస్తారో లేదో చూడాలి!
This post was last modified on June 27, 2021 3:09 pm
దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్…
ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…
"విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల…