వాలిమై.. వాలిమై.. వాలిమై.. ఇప్పుడు తమిళ సినీ ప్రేక్షకుల నోళ్లలో ఎక్కడ చూసినా ఇదే మాట నానుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కార్తితో ‘ఖాకి’ సినిమా తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంతకుముందే అతను అజిత్తో ‘పింక్’ రీమేక్ తీశాడు. అది మంచి విజయమే సాధించింది. ఈసారి సొంత కథతో అజిత్ హీరోగా తీస్తున్న థ్రిల్లర్ మూవీ ‘వాలిమై’.
ఇందులో తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఏడాది కిందటే మొదలైంది. కానీ కరోనా ఇతర కారణాలతో షూటింగ్ ఆలస్యమైంది. ఐతే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా మొదలయ్యాక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూడటం ఖాయం. సినిమా ఆరంభ దశలో ఉండగానే ఈ అప్డేట్ ఆశిస్తారు అభిమానులు. కానీ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.
‘వాలిమై’ అప్ డేట్ కోసం ఏడాది నుంచి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ‘వాలిమై అప్ డేట్ ప్లీజ్’ అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా ఇంగ్లాండ్లోని స్టేడియంలో కూడా ‘వాలిమై అప్ డేట్’ కోసం ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు చేసే హంగామా అంతా కాదు. దీన్నో పెద్ద ఉద్యమం లాగా మార్చేశారు.
ఐతే మేలో అజిత్ పుట్టిన రోజు సందర్భంగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అప్పటికి కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందట. దీంతో అజిత్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. సోషల్ మీడియాను మరోసారి హోరెత్తించేస్తున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…