వాలిమై.. వాలిమై.. వాలిమై.. ఇప్పుడు తమిళ సినీ ప్రేక్షకుల నోళ్లలో ఎక్కడ చూసినా ఇదే మాట నానుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కార్తితో ‘ఖాకి’ సినిమా తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంతకుముందే అతను అజిత్తో ‘పింక్’ రీమేక్ తీశాడు. అది మంచి విజయమే సాధించింది. ఈసారి సొంత కథతో అజిత్ హీరోగా తీస్తున్న థ్రిల్లర్ మూవీ ‘వాలిమై’.
ఇందులో తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఏడాది కిందటే మొదలైంది. కానీ కరోనా ఇతర కారణాలతో షూటింగ్ ఆలస్యమైంది. ఐతే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా మొదలయ్యాక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూడటం ఖాయం. సినిమా ఆరంభ దశలో ఉండగానే ఈ అప్డేట్ ఆశిస్తారు అభిమానులు. కానీ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.
‘వాలిమై’ అప్ డేట్ కోసం ఏడాది నుంచి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ‘వాలిమై అప్ డేట్ ప్లీజ్’ అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా ఇంగ్లాండ్లోని స్టేడియంలో కూడా ‘వాలిమై అప్ డేట్’ కోసం ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు చేసే హంగామా అంతా కాదు. దీన్నో పెద్ద ఉద్యమం లాగా మార్చేశారు.
ఐతే మేలో అజిత్ పుట్టిన రోజు సందర్భంగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అప్పటికి కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందట. దీంతో అజిత్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. సోషల్ మీడియాను మరోసారి హోరెత్తించేస్తున్నారు.
This post was last modified on June 25, 2021 7:07 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…