వాలిమై.. వాలిమై.. వాలిమై.. ఇప్పుడు తమిళ సినీ ప్రేక్షకుల నోళ్లలో ఎక్కడ చూసినా ఇదే మాట నానుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కార్తితో ‘ఖాకి’ సినిమా తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంతకుముందే అతను అజిత్తో ‘పింక్’ రీమేక్ తీశాడు. అది మంచి విజయమే సాధించింది. ఈసారి సొంత కథతో అజిత్ హీరోగా తీస్తున్న థ్రిల్లర్ మూవీ ‘వాలిమై’.
ఇందులో తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఏడాది కిందటే మొదలైంది. కానీ కరోనా ఇతర కారణాలతో షూటింగ్ ఆలస్యమైంది. ఐతే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా మొదలయ్యాక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూడటం ఖాయం. సినిమా ఆరంభ దశలో ఉండగానే ఈ అప్డేట్ ఆశిస్తారు అభిమానులు. కానీ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.
‘వాలిమై’ అప్ డేట్ కోసం ఏడాది నుంచి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ‘వాలిమై అప్ డేట్ ప్లీజ్’ అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా ఇంగ్లాండ్లోని స్టేడియంలో కూడా ‘వాలిమై అప్ డేట్’ కోసం ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు చేసే హంగామా అంతా కాదు. దీన్నో పెద్ద ఉద్యమం లాగా మార్చేశారు.
ఐతే మేలో అజిత్ పుట్టిన రోజు సందర్భంగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అప్పటికి కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందట. దీంతో అజిత్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. సోషల్ మీడియాను మరోసారి హోరెత్తించేస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…