టాలీవుడ్లో యాక్షన్ ఘట్టాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే హీరోల్లో మంచు మనోజ్ ఒకడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసిన అతను.. ఫైట్లలో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలని తపిస్తుంటాడు. కొన్నిసార్లు మనోజ్ సొంతంగా యాక్షన్ ఘట్టాలు కంపోజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
‘కరెంటు తీగ’ లాంటి కొన్ని సినిమాల్లో మనోజ్ చేసిన ఫైట్లు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. ఐతే వరుస ఫ్లాపుల కారణంగా మధ్యలో కొన్నేళ్లు జోరు తగ్గడం, పైగా దాదాపు రెండేళ్లు సినిమాలే లేక ఖాళీగా ఉండిపోవడంతో మనోజ్ను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఐతే అతనిప్పుడు ‘అహం బ్రహ్మాస్మి’ అనే ప్రెస్టీజియస్ మూవీతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆసక్తి రేకెత్తించింది.
సరిగ్గా సినిమా చిత్రీకరణ మొదలు పెడదాం అనుకుంటుండగా లాక్ డౌన్ అడ్డం పడింది. లాక్ డౌన్ ఎత్తేయగానే చిత్రీకరణ మొదలుపెడతామంటున్న మనోజ్.. బుదవారం తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడని.. ఆ దేవుడిని తట్టి లేపాలి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పాడు. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలకు అమితమైన ప్రాధాన్యం ఉందని.. వాటి కోసం తాను కత్తి ఫైటు, కర్రసాము సాధన చేస్తున్నానని చెప్పాడు మనోజ్.
ఈ చిత్రం కోసం తొలిసారి పీటర్ హెయిన్స్తో కలిసి పని చేస్తున్నానని.. ఫైట్ల కోసమే 50 రోజులు కేటాయించబోతున్నామని చెప్పాడు. మనోజ్కు మామూలుగానే ఫైట్లంటే పిచ్చి. పైగా సినిమాలో యాక్షన్కు బాగా స్కోప్ ఉందంటున్నారు. అందులోనూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. మనోజ్ కూడా ఎంతో సాధన చేసి రంగంలోకి దిగుతున్నాడు. కాబట్టి ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాలతో మనోజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడన్నమాటే.
This post was last modified on May 20, 2020 2:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…