ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ నటులను టాలీవుడ్ కు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారు. ఇక హీరో విజయ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ధనుష్ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా అంగీకరించినట్లు సమాచారం. ఓ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెలుగులో ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తీస్తారా లేదా అనేది తెలియాల్సివుంది.
తెలుగులో ధనుష్ ఒప్పుకున్న ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేదు. ధనుష్ కి కేవలం లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ వినిపించాల్సివుంది. అయితే రెండో సినిమాకు యంగ్ డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందట. కాబట్టి వీటిలో ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి!
This post was last modified on June 25, 2021 9:10 am
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…