ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ నటులను టాలీవుడ్ కు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారు. ఇక హీరో విజయ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ధనుష్ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా అంగీకరించినట్లు సమాచారం. ఓ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెలుగులో ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తీస్తారా లేదా అనేది తెలియాల్సివుంది.
తెలుగులో ధనుష్ ఒప్పుకున్న ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేదు. ధనుష్ కి కేవలం లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ వినిపించాల్సివుంది. అయితే రెండో సినిమాకు యంగ్ డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందట. కాబట్టి వీటిలో ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి!
This post was last modified on June 25, 2021 9:10 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…