ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ నటులను టాలీవుడ్ కు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారు. ఇక హీరో విజయ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ధనుష్ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా అంగీకరించినట్లు సమాచారం. ఓ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెలుగులో ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తీస్తారా లేదా అనేది తెలియాల్సివుంది.
తెలుగులో ధనుష్ ఒప్పుకున్న ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేదు. ధనుష్ కి కేవలం లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ వినిపించాల్సివుంది. అయితే రెండో సినిమాకు యంగ్ డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందట. కాబట్టి వీటిలో ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి!
This post was last modified on June 25, 2021 9:10 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…