ఊహించని విధంగా తెలంగాణలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తేస్తూ థియేటర్లు, మాల్స్ సహా అన్నీ తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సినీ జనాలకు ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్ల మీద ఆంక్షలు ఉంటాయని భావించారు. కానీ అలాంటిదేమీ లేకపోయింది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ అంటూ షరతులు కూడా ఏమీ లేవు. ఎప్పట్లాగే థియేటర్లను పూర్తి స్థాయిలో నడుపుకోవచ్చు.
ఈ వెసులుబాటు ఇచ్చేశారు కదా అని థియేటర్లను నడిపిద్దామంటే సినిమాలు లేని పరిస్థితి. ఎవ్వరూ అసలు థియేటర్లే తెరవలేదు. పున:ప్రారంభానికి థియేటర్లు రెడీ చేస్తున్నప్పటికీ.. కనీసం జులై మొదటి వారం నుంచి అయినా అవి కళకళలాడుతాయా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఆగస్టు వరకు ఎదురు చూడక తప్పేలా లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కాస్త పేరున్న సినిమాలను రిలీజ్ చేయాలన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకోవాలి. ఏ ఆంక్షలూ లేకుండా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవాలి. కానీ ఏపీలో ఇంకా పాక్షికంగా లాక్ డౌన్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతోంది. థియేటర్లలో రోజుకు నాలుగు షోలు నడిపించే పరిస్థితి లేదు. పైగా ఆక్యుపెన్సీ విషయంలో స్పష్టత కొరవడింది. దీంతో అక్కడ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. పైగా అక్కడ టికెట్ల రేట్ల విషయంలో పీఠముడి బిగుసుకుంది.
ఈ సమస్యలన్నీ పరిష్కారమై ఒకప్పట్లా థియేటర్లు నడవాలంటే నెల రోజులకు పైగానే పట్టేలా ఉంది. ఆగస్టు మొదటి వారానికి కాపీ ఆ పరిస్థితులు రాకపోవచ్చు. అందుకే ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. జులైలో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పాత సినిమాలనే నెల పాటు నడిపించి.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కొత్త చిత్రాలను విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 23, 2021 3:07 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…