బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు భారీ విజయాన్నందుకున్నాక వివిధ భాషల్లో పాన్ ఇండియా సినిమాలు బోలెడన్ని శ్రీకారం చుట్టుకున్నాయి. అందులో కొన్ని విడుదలయ్యాయి. కొన్ని మేకింగ్ దశలో ఉండగా కరోనా వచ్చి పెద్ద బ్రేక్ వేసేసింది. గత ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ చిత్రాల సందడి తర్వాత ఏ భాషలోనూ భారీ చిత్రాల సందడి అంతగా లేకపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత అన్ని పరిశ్రమలూ కాస్త పుంజుకుంటున్న దశలో తమిళంలో మాస్టర్, తెలుగులో వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు వచ్చాయి. అవి మినహాయిస్తే భారీ చిత్రాల సందడి లేకపోయింది.
ఇక పాన్ ఇండియా సినిమాల ఊసయితే అసలే లేదు. ఆ టైపు సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితులే లేకపోయాయి. ఐతే సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గి మళ్లీ ఆశాజనక పరిస్థితులు కనిపిస్తుండటంతో అన్ని ఇండస్ట్రీలూ కొత్త సినిమాల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. ఆ చిత్రమే.. తలైవి.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. కరోనా లేకుంటే ఏడాది కిందటే ఈ చిత్రం విడుదలయ్యేది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఫస్ట్ వేవ్ తర్వాత సినిమాను పూర్తి చేసి ఏప్రిల్ 23న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఐతే ఇప్పుడు కరోనా ఉద్ధృతి తగ్గి అన్ని చోట్లా థియేటర్ల పునఃప్రారంభానికి రంగం సిద్ధమవుతుండటంతో ఈ చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నారు.
తమిళంలో ఇప్పటికే తలైవికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిపోవడం విశేషం. ఇతర భాషల్లోనూ సెన్సార్కు పంపించబోతున్నారు. అన్ని చోట్లా థియేటర్లు తెరుచుకుని కొంత ఊపు రాగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కరోనా ప్రభావం మొదలయ్యాక రాబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగువాడైన విష్ణువర్ధన్ ఇందూరి నిర్మించాడు.
This post was last modified on June 23, 2021 8:15 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…