తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం ‘తుపాకి’. ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసే విజయ్.. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం అతణ్ని కొత్తగా ప్రెజెంట్ చేసింది. సెన్స్ లెస్ మాస్ ఎలివేషన్లు.. రొటీన్ సీన్లు లేకుండా ఒక భిన్నమైన కథతో స్టైలిష్గా, ఇంటెన్స్గా సాగి ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. తెలుగులో కూడా విజయ్కు ఫాలోయింగ్ పెరగడంలో ఈ సినిమా కీలకం. దీని తర్వాత మురుగదాస్తో కత్తి, సర్కార్ చిత్రాలు చేశాడు విజయ్. కత్తి బ్లాక్బస్టర్ కాగా.. సర్కార్ నిరాశ పరిచింది.
ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నాలుగో చిత్రం చేయడానికి గత ఏడాది రెడీ అయ్యారు. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి ఈ సినిమా ఆగిపోయింది. విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ అనే వేరే దర్శకుడితో సినిమా మొదలుపెట్టాడు. దీంతో మురుగదాస్ అయోమయంలో పడిపోయాడు.
విజయ్తో మురుగదాస్ చేయాలనుకున్నది ‘తుపాకి’ సీక్వెల్ అని అప్పట్లో వార్తలొచ్చాయి. మరి విజయ్ కోరుకున్నట్లుగా స్క్రిప్టు తయారు కాలేదో మరో కారణమో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్టు ఆగిపోయాక మురుగదాస్ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. అతడి కొత్త సినిమా హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. తెలుగు స్టార్లు అల్లు అర్జున్, రామ్ల పేర్లూ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా మురుగ కొత్త సినిమా ఖరారైనట్లు కనిపించలేదు.
ఐతే ఇప్పుడేమో అతను.. లెజెండరీ నటుడు కమల్ హాసన్తో జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘తుపాకి’ సీక్వెల్ను కమల్తో చేయబోతున్నాడని.. ఆయన ఇమేజ్కు తగ్గట్లు కథను మారుస్తున్నాడని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందైతే కమల్, మహేష్ బాబుల కలయికలో మురుగదాస్ ఓ మల్టీస్టారర్ తీయబోతున్నట్లు కూడా ప్రచారం జరగడం విశేషం. కానీ అది నిజం కాదని తేలింది. కమల్తో ‘తుపాకి’ సీక్వెల్ గురించి ఇప్పుడు ప్రచారం నడుస్తోంది. ఇదెంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on June 20, 2021 4:39 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…