సినీ తారలు బాగా సంపాదించాక నగర శివార్లలో ఫామ్ హౌస్లు కొనుక్కోవడం.. అక్కడో చిన్న ఇల్లు కట్టుకుని వీకెండ్స్లో వెళ్లి రావడం.. మనుషుల్ని పెట్టి వ్యవసాయం చేయించడం.. పళ్ల తోటలు పెంచడం మామూలే. ఐతే చాలామంది స్టార్లు సరదాగా అలా వెళ్లి వస్తుంటారు తప్పితే తామే రంగంలోకి దిగి వ్యవసాయం చేయరు. కొందరు మాత్రమే ఇందుకు మినహాయింపుగా ఉంటారు. గత ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. మహారాష్ట్రలోని తన వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఐతే అదంతా ఫొటో షూట్ కోసం చేసిన సెటప్ లాగా కనిపించింది. ఐతే బాలీవుడ్లోనే స్టార్ నటుడైన నవాజుద్దీన్ సిద్ధిఖి మాత్రం ఇలా కాకుండా సీరియస్గా వ్యవసాయంలోకి దిగిపోవడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో గత ఏడాది, అలాగే ఇప్పుడు ఆయన సీరియస్గా వ్యవసాయం చేస్తున్నాడు.
నవాజుద్దీన్ వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినవాడే. వాళ్ల కుటుంబంలో చాలామంది ఇప్పటికీ వ్యవసాయమే చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోనే బుదానాలో నవాజ్కు పొలాలున్నాయి. కరోనా-లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో నవాజ్ గత ఏడాదే అక్కడికి వెళ్లిపోయాడు. మధ్యలో కొన్ని నెలలు చిత్రీకరణలు జరిగినపుడు తిరిగి ముంబయికి వచ్చాడు. కానీ మళ్లీ లాక్ డౌన్ రావడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడ చాలా సీరియస్గా అతను వ్యవసాయం చేస్తున్నాడు. తనే పొలంలోకి దిగి ఒక మామూలు రైతులా పనులు చేసుకుంటున్నాడు. అతడి ఆధ్వర్యంలోనే పంటలు కూడా వేశారు.
లాక్ డౌన్ షరతులు కొంత సడలించి బాలీవుడ్లో షూటింగ్స్ పున:ప్రారంభం అయినప్పటికీ ఈసారి నవాజ్ వెంటనే ముంబయికి రాలేదు. ఇంకొ కొన్ని నెలలు తాను షూటింగ్ల్లో పాల్గొనబోనని.. తన గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయాలనుకుంటున్నానని.. పంటలు పూర్తయి చేతికొచ్చే వరకు ఇక్కడి నుంచి రానని ఓ మీడియా సంస్థకు నవాజ్ చెప్పడం విశేషం.
This post was last modified on June 19, 2021 3:52 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…