రుసో బ్రదర్స్.. హాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రస్తుతం వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డుతో కొనసాగుతున్న ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సృష్టికర్తలు వీళ్లే. దీని కంటే ముందు ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’, ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్’ లాంటి భారీ చిత్రాలను రూపొందించింది ఈ దర్శక ద్వయం.
ప్రస్తుతం వీళ్లిద్దరూ నెట్ ఫ్లిక్స్ కోసం ‘ది గ్రే మ్యాన్’ అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవాన్స్,అనా డి అర్మాస్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ధనుష్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ‘ఫాకిర్’ పేరుతో ఓ ఇంటర్నేషనల్ మూవీ చేశాడు ధనుష్. ఇప్పుడు ఏకంగా రుసో బ్రదర్స్ దర్శకత్వంలో భారీ హాలీవుడ్ చిత్రంలో నటిస్తుండటం మన దేశానికే గర్వకారణం.
రుసో బ్రదర్స్ ఆషామాషీగా ఏమీ ధనుష్ను ‘ది గ్రే మ్యాన్’ కోసం ఎంచుకుని ఉండరు. అతడి ప్రతిభ గురించి వారికి బాగానే తెలిసి ఉంటుంది. తన సినిమాలను వాళ్లు ఫాలో అవుతూనే ఉంటారు. ఇందుకు ఉదాహరణ.. తాజాగా వాళ్లు వేసిన ట్వీట్. శుక్రవారం ధనుష్ కొత్త చిత్రం ‘జగమే తంత్రం’ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముందు రోజు ఆ ట్రైలర్ను షేర్ చేస్తూ రుసో బ్రదర్స్ ట్వీట్ చేశారు. అంతే కాదు.. ‘సూపర్ డా తంబీ’ (సూపర్ రా తమ్ముడూ) అంటూ తమిళ పదాలతో వాళ్లు ట్వీట్ వేయడం విశేషం.
ధనుష్తో కలిసి ‘ది గ్రే మ్యాన్’ కోసం పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని కూడా పేర్కొన్నారు. దీనికి ధనుష్ స్పందిస్తూ.. రుసో సోదరులు ఇలా ట్వీట్ వేయడం తనకు చాలా పెద్ద విషయమని అన్నాడు. మళ్లీ రుసో బ్రదర్స్ అతడికి బదులిస్తూ.. ధనుష్తో పని చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
This post was last modified on June 18, 2021 10:00 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…