రెండేళ్ల కిందట భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘గీత గోవిందం’ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మళ్లీ కలిసి నటించడం.. అద్భుతమైన పాటలు.. చక్కటి ప్రోమోలు ఈ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సగం వరకు సినిమా ఆకట్టుకున్నా.. ద్వితీయార్ధంలో గాడి తప్పి ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాను మెచ్చినా.. మెజారిటీకి రుచించలేదు.
దక్షిణాదిన నాలుగు భాషల్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ‘డియర్ కామ్రేడ్’.. ఆ తర్వాత హిందీలో అనువాదమై అక్కడి ప్రేక్షకులను కట్టి పడేస్తుండటం విశేషం. తెలుగు సినిమాలను హిందీలో అనువాదం చేసి రిలీజ్ చేయడం ద్వారా బాగా పాపులర్ అయిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. గత ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసింది.
విడుదలై ఏడాదిన్నర తిరక్కుండానే ‘డియర్ కామ్రేడ్’ హిందీ వెర్షన్ ఏకంగా 250 మిలియన్ల మార్కును అందుకోవడం విశేషం. ఓ తెలుగు అనువాద చిత్రాన్ని హిందీలో 25 కోట్ల మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా తెలుగు నుంచి వెళ్లే మాస్ మసాలా సినిమాలకే భారీగా వ్యూస్ వస్తుంటాయి. ‘డియర్ కామ్రేడ్’ క్లాస్ మూవీ. పైగా ఇక్కడ డిజాస్టర్ అయింది. దాన్ని ఇంతగా ఆదరించడం అనూహ్యం.
హిందీలో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు అనువాద చిత్రాల్లో ‘డియర్ కామ్రేడ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉండటం ఈ సినిమాకు ఇంతటి ఆదరణ దక్కడానికి కారణం కావచ్చు. ఇలా తెలుగు చిత్రాలను యూట్యూబ్లో హిందీలో రిలీజ్ చేసి గోల్డ్ మైన్ ఫిలిమ్స్ కోట్లు సంపాదిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’కు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు.
This post was last modified on June 18, 2021 6:33 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…