Movie News

హీరోయిన్లను పెళ్లి చేసుకోవద్దంటున్న పూరి!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పాడ్ కాస్ట్ పేరుతో పలు విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు. ఇప్పటికే ప్రేమ, పెళ్లి, ట్రావెలింగ్ వంటి విషయాలపై మాట్లాడిన పూరి తాజాగా హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటే తనకు నచ్చదని అంటున్నారు పూరి. కోటి మందిలో ఒక్కరికి మాత్రమే హీరోయిన్ అయ్యే ఛాన్స్ వస్తుందని.. అందుకే వాళ్లు ఎంతో స్పెషల్ అని అన్నారు. వాళ్లు కూడా అందరిలానే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటే తనకు నచ్చడం లేదని అన్నారు.

హీరోయిన్లను అభిమానులు దేవతల్లా భావిస్తుంటారని.. అలాంటి దేవతలు మెటర్నటీ వార్డ్ లో నొప్పులు పడుతుంటే చూడలేనని అన్నారు. మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లలని కనలేదని అన్నారు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుందని.. దేవతలకు కాదని.. కాబట్టి మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం అంటూ హీరోయిన్లను ఉద్దేశిస్తూ పూరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణ అమ్మాయిలతో పోలిస్తే హీరోయిన్లు అన్ని విషయాల్లో ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారని.. మీరైనా మగాడ్ని దూరం పెట్టొచ్చు కదా..! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా..? అంటూ ప్రశ్నించారు పూరి.

జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ ఇలా చాలా మంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారని అన్నారు. పురాణాల్లో కూడా సింగిల్ విమెన్ ఉన్నారని.. ఉదాహరణగా హిడింబి గురించి చెప్పారు పూరి. అలానే హాలీవుడ్ లో పెళ్లిని పక్కన పెట్టి సూపర్ స్టార్స్ అయిన హీరోయిన్ల గురించి ప్రస్తావించారు. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలకు పెళ్లి కాలేదు కాబట్టే స్వర్గంపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని అన్నారు. ‘రైజింగ్ ట్రైబ్ ఆఫ్ సింగిల్ విమెన్’ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతుందని అన్నారు. హీరోయిన్లు మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ విమెన్ ఎవరూ కూడా పెళ్లిళ్లు చేసుకోవద్దని.. మంగళసూత్రం మర్చిపోండని చెప్పారు.

This post was last modified on June 17, 2021 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

7 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago