యువ కథానాయకుడు నితిన్ కెరీర్లో చాలా వరకు సినిమాలు పేరున్న దర్శకులతో చేసినవే. కథానాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నపుడే తేజ, వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు లాంటి పెద్ద పెద్ద దర్శకులతో అతను సినిమాలు చేశాడు. మధ్యలో వరుస పరాజయాల తర్వాత ఇష్క్తో కోలుకున్న అతను.. ఆ తర్వాత పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకులతో పని చేశాడు. ఈ యంగ్ హీరోకు కొత్త దర్శకులంటే మాత్రం కొంచెం దడే.
విజయ్ కుమార్ కొండాతో చేసిన గుండెజారి గల్లంతయ్యిందే మినహాయిస్తే.. అతడికి డెబ్యూ డైరెక్టర్లతో చేదు అనుభవాలు ఉన్నాయి మరి. హీరో (జీవీ), ద్రోణ (కరుణ్ కుమార్), కొరియర్ బాయ్ కళ్యాణ్ (ప్రేమ్ సాయి) సినిమాలు అందుకు ఉదాహరణ. అయితే కొంత గ్యాప్ తర్వాత నితిన్ మళ్లీ ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డెబ్యూ డైరెక్టర్కు సినిమాలకు సంబంధించి లోతైన అవగాహన, అనుభవమే ఉంది. నితిన్ పని చేయబోయేది టాలీవుడ్లో పేరున్న ఎడిటర్లలో ఒకడైన ఎస్ఆర్ శేఖర్తో కావడం విశేషం. ఎడిటింగ్లో చాలా ఏళ్ల అనుభవం ఉన్న ఎస్ఆర్ శేఖర్.. ఇటీవలే నితిన్కు ఒక కథ చెప్పి ఒప్పించాడట. అతడి పనితనం మీద భరోసాతో సినిమా చేయడానికి ఓకే అన్నాడట. అవసరమైతే నితిన్ సొంత బేనర్లో ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట.
ప్రస్తుతం అంధాదున్ రీమేక్ మేస్ట్రోలో నటిస్తున్న నితిన్.. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. చెక్, రంగ్దె సినిమాల పరాజయంతో ఇబ్బంది పడ్డ నితిన్.. కృష్ణచైతన్యతో చేయాల్సిన పవర్ పేట సినిమాను హోల్డ్లో పెట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 17, 2021 9:55 am
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…