యువ కథానాయకుడు నితిన్ కెరీర్లో చాలా వరకు సినిమాలు పేరున్న దర్శకులతో చేసినవే. కథానాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నపుడే తేజ, వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు లాంటి పెద్ద పెద్ద దర్శకులతో అతను సినిమాలు చేశాడు. మధ్యలో వరుస పరాజయాల తర్వాత ఇష్క్తో కోలుకున్న అతను.. ఆ తర్వాత పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకులతో పని చేశాడు. ఈ యంగ్ హీరోకు కొత్త దర్శకులంటే మాత్రం కొంచెం దడే.
విజయ్ కుమార్ కొండాతో చేసిన గుండెజారి గల్లంతయ్యిందే మినహాయిస్తే.. అతడికి డెబ్యూ డైరెక్టర్లతో చేదు అనుభవాలు ఉన్నాయి మరి. హీరో (జీవీ), ద్రోణ (కరుణ్ కుమార్), కొరియర్ బాయ్ కళ్యాణ్ (ప్రేమ్ సాయి) సినిమాలు అందుకు ఉదాహరణ. అయితే కొంత గ్యాప్ తర్వాత నితిన్ మళ్లీ ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డెబ్యూ డైరెక్టర్కు సినిమాలకు సంబంధించి లోతైన అవగాహన, అనుభవమే ఉంది. నితిన్ పని చేయబోయేది టాలీవుడ్లో పేరున్న ఎడిటర్లలో ఒకడైన ఎస్ఆర్ శేఖర్తో కావడం విశేషం. ఎడిటింగ్లో చాలా ఏళ్ల అనుభవం ఉన్న ఎస్ఆర్ శేఖర్.. ఇటీవలే నితిన్కు ఒక కథ చెప్పి ఒప్పించాడట. అతడి పనితనం మీద భరోసాతో సినిమా చేయడానికి ఓకే అన్నాడట. అవసరమైతే నితిన్ సొంత బేనర్లో ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట.
ప్రస్తుతం అంధాదున్ రీమేక్ మేస్ట్రోలో నటిస్తున్న నితిన్.. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. చెక్, రంగ్దె సినిమాల పరాజయంతో ఇబ్బంది పడ్డ నితిన్.. కృష్ణచైతన్యతో చేయాల్సిన పవర్ పేట సినిమాను హోల్డ్లో పెట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 17, 2021 9:55 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…