యువ కథానాయకుడు నితిన్ కెరీర్లో చాలా వరకు సినిమాలు పేరున్న దర్శకులతో చేసినవే. కథానాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నపుడే తేజ, వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు లాంటి పెద్ద పెద్ద దర్శకులతో అతను సినిమాలు చేశాడు. మధ్యలో వరుస పరాజయాల తర్వాత ఇష్క్తో కోలుకున్న అతను.. ఆ తర్వాత పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకులతో పని చేశాడు. ఈ యంగ్ హీరోకు కొత్త దర్శకులంటే మాత్రం కొంచెం దడే.
విజయ్ కుమార్ కొండాతో చేసిన గుండెజారి గల్లంతయ్యిందే మినహాయిస్తే.. అతడికి డెబ్యూ డైరెక్టర్లతో చేదు అనుభవాలు ఉన్నాయి మరి. హీరో (జీవీ), ద్రోణ (కరుణ్ కుమార్), కొరియర్ బాయ్ కళ్యాణ్ (ప్రేమ్ సాయి) సినిమాలు అందుకు ఉదాహరణ. అయితే కొంత గ్యాప్ తర్వాత నితిన్ మళ్లీ ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డెబ్యూ డైరెక్టర్కు సినిమాలకు సంబంధించి లోతైన అవగాహన, అనుభవమే ఉంది. నితిన్ పని చేయబోయేది టాలీవుడ్లో పేరున్న ఎడిటర్లలో ఒకడైన ఎస్ఆర్ శేఖర్తో కావడం విశేషం. ఎడిటింగ్లో చాలా ఏళ్ల అనుభవం ఉన్న ఎస్ఆర్ శేఖర్.. ఇటీవలే నితిన్కు ఒక కథ చెప్పి ఒప్పించాడట. అతడి పనితనం మీద భరోసాతో సినిమా చేయడానికి ఓకే అన్నాడట. అవసరమైతే నితిన్ సొంత బేనర్లో ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట.
ప్రస్తుతం అంధాదున్ రీమేక్ మేస్ట్రోలో నటిస్తున్న నితిన్.. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. చెక్, రంగ్దె సినిమాల పరాజయంతో ఇబ్బంది పడ్డ నితిన్.. కృష్ణచైతన్యతో చేయాల్సిన పవర్ పేట సినిమాను హోల్డ్లో పెట్టిన సంగతి తెలిసిందే.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…