టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా రానుంది. ఓ పక్క దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ.. మరోపక్క సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మాతగా చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్ లో ఎక్కువగా తన శిష్యులతోనే సినిమాలు తీస్తుంటారు సుకుమార్. నిజానికి సుకుమార్ తన శిష్యులను సెటిల్ చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏదొక రూపంలో వారికి అవకాశాలు వచ్చేలా చేస్తుంటారు.
ఈ ఏడాది ‘ఉప్పెన’తో హిట్ అందుకున్న బుచ్చిబాబు కూడా సుకుమార్ శిష్యుడే. కానీ ఈ సినిమా వెనుకుండి అన్నీ నడిపించింది మాత్రం సుకుమార్ అనే చెప్పాలి. సుకుమార్ ని నమ్మే ‘ఉప్పెన’ లాంటి ప్రాజెక్ట్ ను బుచ్చిబాబు చేతిలో పెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ కి ఓ దారి దొరికింది. అయితే ఇప్పుడు కూడా శిష్యుడికి అండగా నిలుస్తున్నారు సుకుమార్. తన తదుపరి సినిమా ఎవరితో చేయాలనే విషయంలో బుచ్చిబాబులో కన్ఫ్యూజన్ మొదలైంది. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నారు. ఆయనకు కథ కూడా వినిపించారు.
కానీ ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పారు బుచ్చిబాబు. ఈ మీటింగ్ కూడా సెట్ చేసింది సుకుమారే. అయితే ‘పుష్ప’ లాంటి సినిమా చేసిన తరువాత ఎలాంటి కథ చేస్తే బాగుంటుందనే విషయంలో బన్నీ ఆలోచనలో పడ్డారు. బన్నీకి నచ్చజెప్పి తన శిష్యుడితో సినిమా ఓకే చేయించాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ బన్నీ కాదంటే మరో హీరోతో ఆ కథను సెట్ చేసే విధంగా పావులు కదుపుతున్నారు. మొత్తానికి సుకుమార్ తన శిష్యుడికి భరోసా ఇస్తూ మరోసారి సినిమాను సెట్ చేసే బాధ్యత తన భుజాలపై వేసుకున్నారు.
This post was last modified on June 16, 2021 12:08 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…