మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయి. అందుకే ఓటీటీల వైపు చూస్తుంది. ఇప్పటికే ఆమె ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ రెండూ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆమె కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇదిలా ఉండగా.. తమన్నా ఇప్పుడొక టీవీ షోని హోస్ట్ చేయబోతోందని సమాచారం. ‘స్టార్ ప్లస్’లో ప్రసారమవుతోన్న ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. 2010లో మొదలైన ఈ టీవీ షోని విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు ఈ షోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి తమన్నాను హోస్ట్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
మిగిలిన అన్ని భాషల్లో మేల్ స్టార్స్ ను హోస్ట్ లుగా తీసుకుంటుంటే తెలుగులో మాత్రం తమన్నాను ఆన్ బోర్డ్ చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఆమెకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి ఈ షోకి సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తమన్నా నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే ఆమె నితిన్ నటిస్తోన్న ‘మాస్ట్రో’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…