టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత పెళ్లి తరువాత తన రూట్ ని మార్చుకుంది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గ్లామరస్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘యూటర్న్’, ‘మజిలీ’ లాంటి సినిమాలు ఆమెకి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇకపై కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటుందో ఏమో కానీ ఆ తరహా కథలు తన దగ్గరకు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట.
ఈ మధ్య మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమా కోసం సమంతను హీరోయిన్ గా అడిగారట. కానీ ఆమె మాత్రం సున్నితంగా ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. గతంలో సమంత ఇదే బ్యానర్ లో ‘రంగస్థలం’, ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాల్లో నటించింది. ‘రంగస్థలం’ సినిమా ఆమెకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. అయినప్పటికీ మైత్రి ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించిందట. దీనికి కారణం ఆమె కొంతకాలం పాటు కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకోవడమే.
ప్రస్తుతం సమంత ఫోకస్ మొత్తం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ కథలు తన దగ్గరకు వస్తున్నా.. అందులో మంచి కాన్సెప్ట్ ఉంటేనే ఒప్పుకుంటుంది. ఆ విధంగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలనుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 14, 2021 1:45 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…