టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత పెళ్లి తరువాత తన రూట్ ని మార్చుకుంది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గ్లామరస్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘యూటర్న్’, ‘మజిలీ’ లాంటి సినిమాలు ఆమెకి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇకపై కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటుందో ఏమో కానీ ఆ తరహా కథలు తన దగ్గరకు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట.
ఈ మధ్య మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమా కోసం సమంతను హీరోయిన్ గా అడిగారట. కానీ ఆమె మాత్రం సున్నితంగా ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. గతంలో సమంత ఇదే బ్యానర్ లో ‘రంగస్థలం’, ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాల్లో నటించింది. ‘రంగస్థలం’ సినిమా ఆమెకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. అయినప్పటికీ మైత్రి ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించిందట. దీనికి కారణం ఆమె కొంతకాలం పాటు కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకోవడమే.
ప్రస్తుతం సమంత ఫోకస్ మొత్తం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ కథలు తన దగ్గరకు వస్తున్నా.. అందులో మంచి కాన్సెప్ట్ ఉంటేనే ఒప్పుకుంటుంది. ఆ విధంగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలనుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 14, 2021 1:45 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…