వరుస హిట్టు సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజాహెగ్డే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అయితే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని చెబుతోంది ఈ బ్యూటీ. ఏ హీరోయిన్ కైనా పాన్ ఇండియా స్టార్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుందని.. కానీ చాలా తక్కువ మందికి అలాంటి గుర్తింపు వస్తుందని.. ఆ లిస్ట్ లో తను కూడా ఉన్నందుకు సంతోషంగా ఉందని చెబుతోంది.
హృతిక్ రోషన్ తో ‘మొహంజదారో’ సినిమా చేసినప్పుడు చాలా కలలు కన్నానని.. కానీ సినిమా సరిగ్గా ఆడలేదని చెప్పింది. ప్లాప్ వచ్చిన హీరోయిన్ కి ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారని.. అలాంటి ఇబ్బందులను తను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. కెరీర్ ఆరంభంలో అటువంటి చేదు అనుభవాలు చవిచూడడం తనకు బాగా కలిసొచ్చిందని చెబుతోంది పూజాహెగ్డే.
ప్రతి సినిమా ఆడుతుందనే నమ్మకంతోనే చేస్తామని.. ఇప్పుడు హిట్స్, ఫ్లోప్స్ కు అతీతంగా వ్యవహరించడం నేర్చుకున్నట్లు చెప్పింది. ఓ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఇక దాని నుండి బయటకొచ్చేస్తున్నానని తెలిపింది. ఈ మధ్యకాలంలో వరుస సక్సెస్ లతో కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని నమ్మకంగా చెబుతోంది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది. పాన్ ఇండియా నటి కావాలనే కల ఇప్పుడు నిజమైందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
This post was last modified on June 13, 2021 6:43 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…