Movie News

భర్త తో గొడవలపై ప్రియమణి కామెంట్స్!

తెలుగులో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి ప్రియమణి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఆమె కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉట్నూన్నారు. ఓ పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లు ఇవి కాకుండా టీవీ షోలకు జడ్జిగాను పని చేస్తున్నారు ప్రియమణి. రీసెంట్ గా ఈమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ లో ప్రియమణి పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది.

అయితే సీజన్ 1 లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలోలో ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పనని స్పష్టం చేశారు ప్రియమణి. అది టాప్ సీక్రెట్ అని అన్నారు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ‘నారప్ప’, ‘విరాటపర్వం’ లాంటి సినిమాల్లో నటిస్తున్నానని.. రెండు సినిమాల్లో తన పాత్రలు చాలా స్పెషల్ గా ఉంటాయని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తనకు అద్భుతమైన భర్త దొరికాడని.. ఎంతో సపోర్ట్ చేస్తుంటారని అన్నారు. పెళ్లైన తరువాత ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. నిజం చెప్పాలంటే పెళ్లి తరువాత తనకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. నా భర్త నా లక్కీ చార్మ్ అని.. అప్పుడప్పు డు తమ మధ్య గొడవలు వస్తుంటాయని.. ఆ సమయంలోనే ఆయనే తగ్గుతుంటారని ప్రియమణి అన్నారు.

ప్రస్తుతం దర్శకనిర్మాతల మైండ్ సెట్ చాలా మారిందని.. పెళ్లైన హీరోయిన్లకు కూడా అవకాశాలు ఇస్తున్నారని కాజల్, సమంత లాంటి తారలు ఇప్పటికీ స్టార్స్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారని అన్నారు. అయితే పెళ్లైన హీరోయిన్స్ లుక్ పై కొందరు కామెంట్స్ చేస్తుంటారని.. కానీ తనపై ఇప్పటివరకు అలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ రాలేదని స్పష్టం చేశారు.

This post was last modified on June 13, 2021 1:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

5 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago