Movie News

తెలుగు గ‌డ్డ‌పై థియేట‌ర్ తెరుచుకుంది


క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతికి రెండు నెల‌ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు మూత ప‌డ‌టం మొద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేటుగా థియేట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న ఆగింది. చివ‌ర‌గా వ‌కీల్ సాబ్‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. ఆ సినిమా ఓ మోస్త‌రుగా ఆడుతుండ‌గానే.. ఏప్రిల్ చివ‌రి వారంలో థియేట‌ర్లు మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ర్ఫ్యూ, లాక్ డౌన్ అమ‌ల‌వ‌డంతో థియేట‌ర్ల‌ను మూత వేయ‌క త‌ప్ప‌లేదు. ఇక అప్ప‌ట్నుంచి వెండితెర‌లు వెల‌వెల‌బోతూ ఉన్నాయి.

తెలంగాణ‌లో లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడిప్పుడే థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఆగ‌స్టు లేదా ద‌స‌రాకు కానీ బిగ్ స్క్రీన్ల‌లో సినిమాల సంద‌డి మొద‌లు కాద‌నుకుంటున్నారు. ఏపీలో కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంది. థియేట‌ర్ల‌పై ఎవ‌రికీ ప్ర‌స్తుతం ఆశ‌ల్లేవు.

ఐతే ఏపీలో ఇప్పుడు ఒక ప్ర‌ముఖ థియేట‌ర్ తెరుచుకుంటుండ‌టం, అక్క‌డ ఓ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు రంగం సిద్ధం చేయ‌డం విశేషం. విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత జ‌గ‌దాంబ థియేట‌ర్లో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీలో తాజాగా క‌ర్ఫ్యూను ఇంకో ప‌ది రోజులు పొడిగించిన ప్ర‌భుత్వం.. ఉద‌యం 6-12 గంట‌ల మ‌ధ్య జ‌నాలు బ‌య‌ట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వ‌హించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంట‌లు పొడిగించింది. అంటే మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు అన్ని కార్య‌క‌లాపాలు కొన‌సాగుతాయ‌న్న‌మాట‌.

క‌ర్ఫ్యూ పెట్ట‌డానికి ముందు థియేట‌ర్ల‌పై ప్ర‌త్యేకంగా ఆంక్ష‌లేమీ పెట్ట‌ని నేప‌థ్యంలో ఇప్పుడు మార్నింగ్ షో ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌కాశం దొరికింది. దీంతో జ‌గ‌దాంబ థియేట‌ర్ యాజ‌మాన్యం ఉద‌యం ప‌దిన్న‌ర నుంచి మార్నింగ్ షో ఒక‌టి న‌డిపించే ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ త‌ర్వాత తెరుచుకుని సినిమా న‌డిపించ‌బోతున్న‌ తొలి, ఏకైక థియేట‌ర్ ఇదే కావ‌డం విశేషం.

This post was last modified on June 13, 2021 9:06 am

Share
Show comments

Recent Posts

చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

2 hours ago

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…

2 hours ago

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…

4 hours ago

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…

5 hours ago

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…

5 hours ago

ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…

5 hours ago