కరోనా రెండో దశ ఉద్ధృతికి రెండు నెలల కిందట దేశవ్యాప్తంగా థియేటర్లు మూత పడటం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేటుగా థియేటర్ల ప్రదర్శన ఆగింది. చివరగా వకీల్ సాబ్తో థియేటర్లు కళకళలాడాయి. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడుతుండగానే.. ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలవడంతో థియేటర్లను మూత వేయక తప్పలేదు. ఇక అప్పట్నుంచి వెండితెరలు వెలవెలబోతూ ఉన్నాయి.
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టు లేదా దసరాకు కానీ బిగ్ స్క్రీన్లలో సినిమాల సందడి మొదలు కాదనుకుంటున్నారు. ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. థియేటర్లపై ఎవరికీ ప్రస్తుతం ఆశల్లేవు.
ఐతే ఏపీలో ఇప్పుడు ఒక ప్రముఖ థియేటర్ తెరుచుకుంటుండటం, అక్కడ ఓ సినిమా ప్రదర్శనకు రంగం సిద్ధం చేయడం విశేషం. విశాఖపట్నంలోని ప్రఖ్యాత జగదాంబ థియేటర్లో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్ను ప్రదర్శిస్తున్నారు. ఏపీలో తాజాగా కర్ఫ్యూను ఇంకో పది రోజులు పొడిగించిన ప్రభుత్వం.. ఉదయం 6-12 గంటల మధ్య జనాలు బయట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంటలు పొడిగించింది. అంటే మధ్యాహ్నం 2 వరకు అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయన్నమాట.
కర్ఫ్యూ పెట్టడానికి ముందు థియేటర్లపై ప్రత్యేకంగా ఆంక్షలేమీ పెట్టని నేపథ్యంలో ఇప్పుడు మార్నింగ్ షో ప్రదర్శనకు అవకాశం దొరికింది. దీంతో జగదాంబ థియేటర్ యాజమాన్యం ఉదయం పదిన్నర నుంచి మార్నింగ్ షో ఒకటి నడిపించే ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకుని సినిమా నడిపించబోతున్న తొలి, ఏకైక థియేటర్ ఇదే కావడం విశేషం.
This post was last modified on June 13, 2021 9:06 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…