Movie News

తెలుగు గ‌డ్డ‌పై థియేట‌ర్ తెరుచుకుంది


క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతికి రెండు నెల‌ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు మూత ప‌డ‌టం మొద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేటుగా థియేట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న ఆగింది. చివ‌ర‌గా వ‌కీల్ సాబ్‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. ఆ సినిమా ఓ మోస్త‌రుగా ఆడుతుండ‌గానే.. ఏప్రిల్ చివ‌రి వారంలో థియేట‌ర్లు మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ర్ఫ్యూ, లాక్ డౌన్ అమ‌ల‌వ‌డంతో థియేట‌ర్ల‌ను మూత వేయ‌క త‌ప్ప‌లేదు. ఇక అప్ప‌ట్నుంచి వెండితెర‌లు వెల‌వెల‌బోతూ ఉన్నాయి.

తెలంగాణ‌లో లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడిప్పుడే థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఆగ‌స్టు లేదా ద‌స‌రాకు కానీ బిగ్ స్క్రీన్ల‌లో సినిమాల సంద‌డి మొద‌లు కాద‌నుకుంటున్నారు. ఏపీలో కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంది. థియేట‌ర్ల‌పై ఎవ‌రికీ ప్ర‌స్తుతం ఆశ‌ల్లేవు.

ఐతే ఏపీలో ఇప్పుడు ఒక ప్ర‌ముఖ థియేట‌ర్ తెరుచుకుంటుండ‌టం, అక్క‌డ ఓ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు రంగం సిద్ధం చేయ‌డం విశేషం. విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత జ‌గ‌దాంబ థియేట‌ర్లో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీలో తాజాగా క‌ర్ఫ్యూను ఇంకో ప‌ది రోజులు పొడిగించిన ప్ర‌భుత్వం.. ఉద‌యం 6-12 గంట‌ల మ‌ధ్య జ‌నాలు బ‌య‌ట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వ‌హించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంట‌లు పొడిగించింది. అంటే మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు అన్ని కార్య‌క‌లాపాలు కొన‌సాగుతాయ‌న్న‌మాట‌.

క‌ర్ఫ్యూ పెట్ట‌డానికి ముందు థియేట‌ర్ల‌పై ప్ర‌త్యేకంగా ఆంక్ష‌లేమీ పెట్ట‌ని నేప‌థ్యంలో ఇప్పుడు మార్నింగ్ షో ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌కాశం దొరికింది. దీంతో జ‌గ‌దాంబ థియేట‌ర్ యాజ‌మాన్యం ఉద‌యం ప‌దిన్న‌ర నుంచి మార్నింగ్ షో ఒక‌టి న‌డిపించే ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ త‌ర్వాత తెరుచుకుని సినిమా న‌డిపించ‌బోతున్న‌ తొలి, ఏకైక థియేట‌ర్ ఇదే కావ‌డం విశేషం.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

2 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

2 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

4 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

4 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

5 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

5 hours ago