కరోనా రెండో దశ ఉద్ధృతికి రెండు నెలల కిందట దేశవ్యాప్తంగా థియేటర్లు మూత పడటం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేటుగా థియేటర్ల ప్రదర్శన ఆగింది. చివరగా వకీల్ సాబ్తో థియేటర్లు కళకళలాడాయి. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడుతుండగానే.. ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలవడంతో థియేటర్లను మూత వేయక తప్పలేదు. ఇక అప్పట్నుంచి వెండితెరలు వెలవెలబోతూ ఉన్నాయి.
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టు లేదా దసరాకు కానీ బిగ్ స్క్రీన్లలో సినిమాల సందడి మొదలు కాదనుకుంటున్నారు. ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. థియేటర్లపై ఎవరికీ ప్రస్తుతం ఆశల్లేవు.
ఐతే ఏపీలో ఇప్పుడు ఒక ప్రముఖ థియేటర్ తెరుచుకుంటుండటం, అక్కడ ఓ సినిమా ప్రదర్శనకు రంగం సిద్ధం చేయడం విశేషం. విశాఖపట్నంలోని ప్రఖ్యాత జగదాంబ థియేటర్లో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్ను ప్రదర్శిస్తున్నారు. ఏపీలో తాజాగా కర్ఫ్యూను ఇంకో పది రోజులు పొడిగించిన ప్రభుత్వం.. ఉదయం 6-12 గంటల మధ్య జనాలు బయట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంటలు పొడిగించింది. అంటే మధ్యాహ్నం 2 వరకు అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయన్నమాట.
కర్ఫ్యూ పెట్టడానికి ముందు థియేటర్లపై ప్రత్యేకంగా ఆంక్షలేమీ పెట్టని నేపథ్యంలో ఇప్పుడు మార్నింగ్ షో ప్రదర్శనకు అవకాశం దొరికింది. దీంతో జగదాంబ థియేటర్ యాజమాన్యం ఉదయం పదిన్నర నుంచి మార్నింగ్ షో ఒకటి నడిపించే ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకుని సినిమా నడిపించబోతున్న తొలి, ఏకైక థియేటర్ ఇదే కావడం విశేషం.
This post was last modified on June 13, 2021 9:06 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…