మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ఏ ముహూర్తాన అడుగు పెట్టాడో కానీ.. అప్పట్నుంచి అభిమానుల్ని మామూలుగా ఎంటర్టైన్ చేయట్లేదు. ఆయన ఒక మెసేజ్ పెట్టినా.. ఒక ఫొటో షేర్ చేసినా.. ఒక వీడియో పంచుకున్నా.. అందులో పంచ్ కచ్చితంగా ఉంటోంది. కొన్ని ఎమోషనల్ వీడియోల్ని పక్కన పెడితే.. చిరు టార్గెట్ ఎంటర్టైన్మెంటే.
తాజాగా ఆయన ఒక ఆసక్తికర ఫొటోతో అభిమానుల్ని మురిపిస్తున్నారు. వంట గదిలో భార్య పక్కనుండగా సీరియస్గా వంటలో నిమగ్నమైన రెండు ఫొటోల్ని చిరు షేర్ చేశారు. ఐతే ఆ రెండు ఫొటోల మధ్య గ్యాప్ 30 ఏళ్లు కావడం విశేషం.
1990లో భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన చిరు.. సీరియస్గా గరిట చేతబట్టి ఏదో వండే ప్రయత్నంలో ున్నాడు. అప్పుడు చిరు బ్లూ టీ షర్ట్, జీన్స్లో ఉన్నారు. పక్కన సురేఖ ఎరుపు రంగు చీర కట్టుకుని ఉన్నారు.
దాదాపు అదే డ్రెస్సింగ్.. అదే వాతావరణంతో ఇప్పుడు చిరు, సురేఖ ఫొటో దిగారు. చిరు అప్పట్లాగే బ్లూ టీషర్ట్, జీన్స్ వేసుకుని కుడి చేత్తో గరిట, ఎడమ చేత్తో పాన్ పట్టుకుని సీరియస్గా వంట పనిలో నిమగ్నమై ఉండగా.. పక్కన పాత్ర పట్టుకుని సురేఖ ఎరుపు రంగు చీరలో నిలబడి ఉన్నారు.
పాత ఫొటోకు ‘జాయ్ ఫుల్ హాలిడే ఇన్ అమెరికా 1990’ అని క్యాప్షన్ పెట్టిన చిరు.. ప్రస్తుత ఫొటోకు మాత్రం ‘జైల్ ఫుల్ హాలిడే ఇన్ కరోనా 2020’ అంటూ తనదైన శైలిలో చమత్కారం జోడించారు. ఈ ఫొటో నిమిషాల్లో వైరల్ అయిపోయింది.
చాలామంది స్టార్లు సోషల్ మీడియాలో ఉన్నామంటే ఉన్నాం అనిపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే తమ స్థాయి తగ్గిపోతుందేమో అన్నట్లుగా గుంభనంగా ఉంటున్నారు. కానీ చిరు మాత్రం అలాంటి శషబిషలేమీ పెట్టుకోకుండా నిరంతరం ఎంటర్టైన్ చేస్తూ సాగుతుండటం ఆయన ప్రత్యేకతను చాటి చెబుతోంది.
This post was last modified on May 18, 2020 1:28 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…