Movie News

సుశాంత్ మీద రెండు సినిమాలు

వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన క్రైమ్ స్టోరీల ఆధారంగా తరచుగా అక్కడ సినిమాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి మీదా సినిమాలు తీసేస్తున్నారు అక్కడి ఫిలిం మేకర్స్. సుశాంత్ మృతి నేపథ్యంలో హిందీలో ఒకటికి రెండు సినిమాలు తయారవుతుండటం గమనార్హం.

ఐతే ఈ రెండు సినిమాల పట్ల సుశాంత్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాల విడుదలను ఆపాలంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ అక్కడ ఆయనకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

సుశాంత్ జీవిత కథ ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సుసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్’ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి హింీలో. ‘న్యాయ్’ మూవీ విడుదలకు సైతం సిద్ధమైంది. ఇందులో సుశాంత్ పాత్రను జుబర్.కె.ఖాన్ పోషించాడు. దిలీప్ గులాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ చిత్రంలో సుశాంత్ పేరును, అతడి జీవితంలోని ఘటనలను ఉదహరించకుండా చూడాలని.. సినిమా విడుదలను ఆపాలని.. ఈ చిత్రం తెరకెక్కించడం ద్వారా తమ కుటుంబానికి మానసిక వేదనను కలిగించినందుకు గాను రూ.2 కోట్ల నష్ట పరిహారం కూడా చెల్లించాలని కేకే సింగ్ తన పిటిషన్లో కోరారు.

కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ‘న్యాయ్’ విడుదలను తాము అడ్డుకోజాలమని పేర్కొంది. సుశాంత్ మీద తెరకెక్కుతున్న మిగతా సినిమాల విషయంలోనూ కేకే సింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

This post was last modified on June 11, 2021 12:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago