వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన క్రైమ్ స్టోరీల ఆధారంగా తరచుగా అక్కడ సినిమాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి మీదా సినిమాలు తీసేస్తున్నారు అక్కడి ఫిలిం మేకర్స్. సుశాంత్ మృతి నేపథ్యంలో హిందీలో ఒకటికి రెండు సినిమాలు తయారవుతుండటం గమనార్హం.
ఐతే ఈ రెండు సినిమాల పట్ల సుశాంత్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాల విడుదలను ఆపాలంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ అక్కడ ఆయనకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఆయన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
సుశాంత్ జీవిత కథ ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సుసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్’ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి హింీలో. ‘న్యాయ్’ మూవీ విడుదలకు సైతం సిద్ధమైంది. ఇందులో సుశాంత్ పాత్రను జుబర్.కె.ఖాన్ పోషించాడు. దిలీప్ గులాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ చిత్రంలో సుశాంత్ పేరును, అతడి జీవితంలోని ఘటనలను ఉదహరించకుండా చూడాలని.. సినిమా విడుదలను ఆపాలని.. ఈ చిత్రం తెరకెక్కించడం ద్వారా తమ కుటుంబానికి మానసిక వేదనను కలిగించినందుకు గాను రూ.2 కోట్ల నష్ట పరిహారం కూడా చెల్లించాలని కేకే సింగ్ తన పిటిషన్లో కోరారు.
కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ‘న్యాయ్’ విడుదలను తాము అడ్డుకోజాలమని పేర్కొంది. సుశాంత్ మీద తెరకెక్కుతున్న మిగతా సినిమాల విషయంలోనూ కేకే సింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
This post was last modified on June 11, 2021 12:49 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…