Movie News

సుశాంత్ మీద రెండు సినిమాలు

వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన క్రైమ్ స్టోరీల ఆధారంగా తరచుగా అక్కడ సినిమాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి మీదా సినిమాలు తీసేస్తున్నారు అక్కడి ఫిలిం మేకర్స్. సుశాంత్ మృతి నేపథ్యంలో హిందీలో ఒకటికి రెండు సినిమాలు తయారవుతుండటం గమనార్హం.

ఐతే ఈ రెండు సినిమాల పట్ల సుశాంత్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాల విడుదలను ఆపాలంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ అక్కడ ఆయనకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

సుశాంత్ జీవిత కథ ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సుసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్’ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి హింీలో. ‘న్యాయ్’ మూవీ విడుదలకు సైతం సిద్ధమైంది. ఇందులో సుశాంత్ పాత్రను జుబర్.కె.ఖాన్ పోషించాడు. దిలీప్ గులాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ చిత్రంలో సుశాంత్ పేరును, అతడి జీవితంలోని ఘటనలను ఉదహరించకుండా చూడాలని.. సినిమా విడుదలను ఆపాలని.. ఈ చిత్రం తెరకెక్కించడం ద్వారా తమ కుటుంబానికి మానసిక వేదనను కలిగించినందుకు గాను రూ.2 కోట్ల నష్ట పరిహారం కూడా చెల్లించాలని కేకే సింగ్ తన పిటిషన్లో కోరారు.

కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ‘న్యాయ్’ విడుదలను తాము అడ్డుకోజాలమని పేర్కొంది. సుశాంత్ మీద తెరకెక్కుతున్న మిగతా సినిమాల విషయంలోనూ కేకే సింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

7 minutes ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

1 hour ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

2 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

4 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

6 hours ago