పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ నెలలోనే ఈ కాంబో పట్టాలెక్కాల్సింది కానీ కరోనా కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కి జోడీగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ సమంతను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు టాక్. గతంలో హరీష్ శంకర్ రూపొందించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రొమాన్స్ చేసింది సమంత. వెండితెరపై వీరి కెమిస్ట్రీ బాగానే పండింది. ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి తన సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారట. ఎలాంటి పాత్రలోనైనా సమంత ఒదిగిపోతారు. అందుకే మేకర్లు ఆమెని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె తెలుగులో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. దీంతో పవన్ సినిమాకి కాల్షీట్స్ సమస్య కూడా రాదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on June 10, 2021 8:19 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…