పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ నెలలోనే ఈ కాంబో పట్టాలెక్కాల్సింది కానీ కరోనా కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కి జోడీగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ సమంతను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు టాక్. గతంలో హరీష్ శంకర్ రూపొందించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రొమాన్స్ చేసింది సమంత. వెండితెరపై వీరి కెమిస్ట్రీ బాగానే పండింది. ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి తన సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారట. ఎలాంటి పాత్రలోనైనా సమంత ఒదిగిపోతారు. అందుకే మేకర్లు ఆమెని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె తెలుగులో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. దీంతో పవన్ సినిమాకి కాల్షీట్స్ సమస్య కూడా రాదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on June 10, 2021 8:19 am
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుది పాలనలో ఎప్పుడూ ప్రత్యేక శైలే. అందరికీ ఆదర్శప్రాయమైన నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు…ప్రజా ధనం దుబారా…
రాజకీయ సన్యాసం అంటూ తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… రోజుకో రీతిన వ్యవహరిస్తూ…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఒకడిగా ఉదిత్ నారాయణ పేరు చెప్పొచ్చు. ఆయన దక్షిణాది సంగీత…
ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒకటేమో ఏకంగా 400 కోట్ల బడ్జెట్…
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…