పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ నెలలోనే ఈ కాంబో పట్టాలెక్కాల్సింది కానీ కరోనా కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కి జోడీగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ సమంతను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు టాక్. గతంలో హరీష్ శంకర్ రూపొందించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రొమాన్స్ చేసింది సమంత. వెండితెరపై వీరి కెమిస్ట్రీ బాగానే పండింది. ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి తన సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారట. ఎలాంటి పాత్రలోనైనా సమంత ఒదిగిపోతారు. అందుకే మేకర్లు ఆమెని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె తెలుగులో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. దీంతో పవన్ సినిమాకి కాల్షీట్స్ సమస్య కూడా రాదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…