పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ నెలలోనే ఈ కాంబో పట్టాలెక్కాల్సింది కానీ కరోనా కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కి జోడీగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ సమంతను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు టాక్. గతంలో హరీష్ శంకర్ రూపొందించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రొమాన్స్ చేసింది సమంత. వెండితెరపై వీరి కెమిస్ట్రీ బాగానే పండింది. ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి తన సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారట. ఎలాంటి పాత్రలోనైనా సమంత ఒదిగిపోతారు. అందుకే మేకర్లు ఆమెని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె తెలుగులో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. దీంతో పవన్ సినిమాకి కాల్షీట్స్ సమస్య కూడా రాదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on June 10, 2021 8:19 am
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…