వెళ్లిపోమాకే అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్సేన్. అందులో చాలా డల్లుగా ఉండే పాత్ర చేసిన విశ్వక్ పెద్దగా జనాల దృష్టిలో పడలేదు. ఆ సినిమా కూడా అనుకున్నంతగా జనాలకు రీచ్ కాలేదు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ నగరానికి ఏమైంది పర్వాలేదనిపించింది తప్ప.. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోవడంతో విశ్వక్ గురించి పెద్దగా చర్చ లేకపోయింది. కానీ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ఫలక్నుమా దాస్తో అతడి పేరు మార్మోగింది.
ఈ సినిమా కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైనప్పటికీ.. రిలీజ్ ముంగిట దీనికి మంచి హైపే వచ్చింది. మలయాళం బ్లాక్బస్టర్ అంగామలై డైరీస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వక్ ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. దాస్ పాత్రలో అతడి దూకుడు యూత్కు బాగా నచ్చింది. ఆ సినిమాతోనే విశ్వక్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
హిట్ మూవీతో మంచి హిట్ కొట్టి.. ప్రస్తుతం పాగల్ సహా రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విశ్వక్.. త్వరలోనే ఫలక్నుమా దాస్కు సీక్వెల్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమా వచ్చినపుడే విశ్వక్ దీనికి సీక్వెల్ ఉంటుందన్నాడు కానీ.. ఆ తర్వాత దాని ఊసే లేదు. కేవలం పబ్లిసిటీ కోసం చెప్పిన మాటలాగే అనిపించిందది. కానీ ఫలక్నుమా దాస్ రిలీజైన మూడేళ్లు కావస్తుండగా ఇప్పుడు అతను సీక్వెల్ గురించి సంకేతాలు ఇవ్వడం విశేషం.
ఈ సినిమా ప్రారంభోత్సవం జరిపి మూడేళ్లు అయిన సందర్భంగా ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన విశ్వక్.. ఫలక్నుమా దాస్-2 ఉంటుందని, త్వరలోనే ఆ చిత్రం మొదలవుతుందని ప్రకటించాడు. ఐతే ఫలక్నుమా దాస్ ఒరిజినల్ అంగామలై డైరీస్కు మలయాళంలో సీక్వెల్ ఏమీ రాలేదు. అంటే ఈసారి సొంతంగా కథ అల్లుకుని విశ్వక్ రంగంలోకి దిగుతాడన్నమాట.
This post was last modified on June 8, 2021 7:29 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…