వెళ్లిపోమాకే అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్సేన్. అందులో చాలా డల్లుగా ఉండే పాత్ర చేసిన విశ్వక్ పెద్దగా జనాల దృష్టిలో పడలేదు. ఆ సినిమా కూడా అనుకున్నంతగా జనాలకు రీచ్ కాలేదు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ నగరానికి ఏమైంది పర్వాలేదనిపించింది తప్ప.. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోవడంతో విశ్వక్ గురించి పెద్దగా చర్చ లేకపోయింది. కానీ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ఫలక్నుమా దాస్తో అతడి పేరు మార్మోగింది.
ఈ సినిమా కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైనప్పటికీ.. రిలీజ్ ముంగిట దీనికి మంచి హైపే వచ్చింది. మలయాళం బ్లాక్బస్టర్ అంగామలై డైరీస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వక్ ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. దాస్ పాత్రలో అతడి దూకుడు యూత్కు బాగా నచ్చింది. ఆ సినిమాతోనే విశ్వక్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
హిట్ మూవీతో మంచి హిట్ కొట్టి.. ప్రస్తుతం పాగల్ సహా రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విశ్వక్.. త్వరలోనే ఫలక్నుమా దాస్కు సీక్వెల్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమా వచ్చినపుడే విశ్వక్ దీనికి సీక్వెల్ ఉంటుందన్నాడు కానీ.. ఆ తర్వాత దాని ఊసే లేదు. కేవలం పబ్లిసిటీ కోసం చెప్పిన మాటలాగే అనిపించిందది. కానీ ఫలక్నుమా దాస్ రిలీజైన మూడేళ్లు కావస్తుండగా ఇప్పుడు అతను సీక్వెల్ గురించి సంకేతాలు ఇవ్వడం విశేషం.
ఈ సినిమా ప్రారంభోత్సవం జరిపి మూడేళ్లు అయిన సందర్భంగా ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన విశ్వక్.. ఫలక్నుమా దాస్-2 ఉంటుందని, త్వరలోనే ఆ చిత్రం మొదలవుతుందని ప్రకటించాడు. ఐతే ఫలక్నుమా దాస్ ఒరిజినల్ అంగామలై డైరీస్కు మలయాళంలో సీక్వెల్ ఏమీ రాలేదు. అంటే ఈసారి సొంతంగా కథ అల్లుకుని విశ్వక్ రంగంలోకి దిగుతాడన్నమాట.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…