టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కథను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని.. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తోన్న సుకుమార్ మరోపక్క నిర్మాతగా పలు ప్రాజెక్ట్ లను పట్టాలెక్కిస్తున్నారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇప్పటికే ‘కుమారి 21 ఎఫ్’, ‘దర్శకుడు’, ‘ఉప్పెన’ లాంటి సినిమాలను నిర్మించిన సుకుమార్ ప్రస్తుతం ’18 పేజెస్’ సినిమాను నిర్మిస్తున్నారు. అలానే లైన్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా ఉంది. ఈ బ్యానర్ లో తన శిష్యులతో పాటు టాలెంట్ ఉన్న దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు సుకుమార్. కేవలం నిర్మించడం వరకు మాత్రమే కాకుండా.. సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందనే దానిపై దృష్టి పెడతారు. కావాలంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తుంటారు.
ఇప్పుడు సుకుమార్ రూటులోనే కొందరు దర్శకులు సొంత బ్యానర్లను స్థాపించి సినిమాలను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి.. దానిపై కొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా కొందరు దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అలానే ఇండస్ట్రీలో ఉన్న కొందరు దర్శకులు కూడా ఇదే స్ట్రాటజీను ఫాలో అవ్వాలనుకుంటున్నారట. ఈ లెక్కన ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రావడం ఖాయమనిపిస్తుంది!
This post was last modified on June 8, 2021 7:26 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…