Movie News

సుకుమార్ రూట్ లో స్టార్ డైరెక్టర్స్!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కథను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని.. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తోన్న సుకుమార్ మరోపక్క నిర్మాతగా పలు ప్రాజెక్ట్ లను పట్టాలెక్కిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇప్పటికే ‘కుమారి 21 ఎఫ్’, ‘దర్శకుడు’, ‘ఉప్పెన’ లాంటి సినిమాలను నిర్మించిన సుకుమార్ ప్రస్తుతం ’18 పేజెస్’ సినిమాను నిర్మిస్తున్నారు. అలానే లైన్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా ఉంది. ఈ బ్యానర్ లో తన శిష్యులతో పాటు టాలెంట్ ఉన్న దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు సుకుమార్. కేవలం నిర్మించడం వరకు మాత్రమే కాకుండా.. సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందనే దానిపై దృష్టి పెడతారు. కావాలంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తుంటారు.

ఇప్పుడు సుకుమార్ రూటులోనే కొందరు దర్శకులు సొంత బ్యానర్లను స్థాపించి సినిమాలను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి.. దానిపై కొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా కొందరు దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అలానే ఇండస్ట్రీలో ఉన్న కొందరు దర్శకులు కూడా ఇదే స్ట్రాటజీను ఫాలో అవ్వాలనుకుంటున్నారట. ఈ లెక్కన ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రావడం ఖాయమనిపిస్తుంది!

This post was last modified on June 8, 2021 7:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago