స్టార్ హీరోయిన్లు మామూలుగా ఎవరికి వాళ్లే అన్నట్లుంటారు. ఒకరితో ఒకరు క్లోజ్గా ఉండటం, ప్రొఫెషనల్గా కాకుండా వ్యక్తిగతంగా బాగా దగ్గరవడం అరుదుగా కనిపిస్తుంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి వేర్వేరు ఇండస్ట్రీల్లో తీరిక లేకుండా పని చేయడం ఇందుకు కారణం కావచ్చు. ఐతే కొంతమంది స్టార్ హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంటారు. బాగా క్లోజ్ అవుతుంటారు.
మిల్కీ బ్యూటీ తమన్నా, కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ ఈ కోవకే చెందుతారు. వాళ్లిద్దరూ చాలా ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నారు. వ్యక్తిగతంగా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. శ్రుతితో స్నేహం గురించి తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఎప్పుడు బాధగా అనిపించినా కాల్ చేసేది శ్రుతికే అని.. ఆమె తనకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని మిల్కీ బ్యూటీ చెప్పింది.
“నేనెప్పుడైనా బాధలో ఉంటే శ్రుతికే కాల్ చేస్తా. తను ఎప్పుడూ అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతుందో అడుగుతుంటా. తనలా ఉండటం చాలా కష్టం. తన ఇంటిని పూర్తిగా శ్రుతినే చూసుకుంటుంది. దాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. ఒంటరిగా ఉంటూ కష్టపడి కెరీర్ను కొనసాగిస్తుంటుంది. అదే సమయంలో శ్రుతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన అభిమానులతో కనెక్ట్ అయి ఉంటుంది. చాలా హుషారుగా మాట్లాడుతుంది. ఎప్పుడూ తనలా సరదాగా ఉండటం తేలిక కాదు. అందుకే నేను తన నుంచి స్ఫూర్తి పొందుతా” అని తమన్నా పేర్కొంది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…