సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో జోరు పెంచాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ మొత్తం ఎఫెక్ట్ అయింది. కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా అది కూడా ఆలస్యమవుతోంది. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన మరో ఆరు నెలల్లో.. అంటే వచ్చే ఏడాది వేసవికి తన నుండి మరో సినిమా విడుదలయ్యే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలుపెట్టాలనుకుంటున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ ను పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అనుకున్న ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి వేసవి నాటికి ఫస్ట్ కాపీ రెడీ ఉండేలా ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకపోతే.. మహేష్ బాబు నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదల కావడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…