సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో జోరు పెంచాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ మొత్తం ఎఫెక్ట్ అయింది. కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా అది కూడా ఆలస్యమవుతోంది. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన మరో ఆరు నెలల్లో.. అంటే వచ్చే ఏడాది వేసవికి తన నుండి మరో సినిమా విడుదలయ్యే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలుపెట్టాలనుకుంటున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ ను పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అనుకున్న ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి వేసవి నాటికి ఫస్ట్ కాపీ రెడీ ఉండేలా ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకపోతే.. మహేష్ బాబు నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదల కావడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…