సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో జోరు పెంచాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ మొత్తం ఎఫెక్ట్ అయింది. కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా అది కూడా ఆలస్యమవుతోంది. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన మరో ఆరు నెలల్లో.. అంటే వచ్చే ఏడాది వేసవికి తన నుండి మరో సినిమా విడుదలయ్యే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలుపెట్టాలనుకుంటున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ ను పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అనుకున్న ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి వేసవి నాటికి ఫస్ట్ కాపీ రెడీ ఉండేలా ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకపోతే.. మహేష్ బాబు నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదల కావడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
This post was last modified on June 6, 2021 7:01 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…