సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో జోరు పెంచాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ మొత్తం ఎఫెక్ట్ అయింది. కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా అది కూడా ఆలస్యమవుతోంది. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన మరో ఆరు నెలల్లో.. అంటే వచ్చే ఏడాది వేసవికి తన నుండి మరో సినిమా విడుదలయ్యే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలుపెట్టాలనుకుంటున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ ను పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అనుకున్న ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి వేసవి నాటికి ఫస్ట్ కాపీ రెడీ ఉండేలా ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకపోతే.. మహేష్ బాబు నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదల కావడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
This post was last modified on June 6, 2021 7:01 am
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…