Movie News

యంగ్ డైరెక్టర్ తో బాలయ్య..!

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అలా వచ్చిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు కూడా ఓ సరికొత్త కాంబోలో సినిమా వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అనీల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్ కూడా బాలయ్య కోసం కథ రాసుకొని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు అనీల్ తో పాటు మరో యంగ్ డైరెక్టర్ కూడా బాలయ్య హీరోగా సినిమా చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే వెంకీ అట్లూరి. ‘స్నేహగీతం’ అనే సినిమాలో నటించిన ఇతడు ఆ తరువాత దర్శకుడిగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ సినిమా భారీ విజయాన్ని తీసుకొచ్చింది. ఆ తరువాత తెరకెక్కించిన ‘మిస్టర్ మజ్ను’,’రంగ్ దే’ లాంటి సినిమాలు ఏవరేజ్ గా ఆడాయి. అతడి సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తన తదుపరి సినిమా కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ కుర్ర డైరెక్టర్ బాలయ్యను మీట్ అయినట్లు సమాచారం. తన దగ్గరున్న ఓ స్టోరీ లైన్ ను బాలయ్యకు వినిపించారట వెంకీ అట్లూరి. పూర్తి కథను సిద్ధం చేశాక.. అది సంతృప్తిగా అనిపిస్తే అప్పుడు చూద్దామని బాలయ్య చెప్పారట. దీంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు.

This post was last modified on June 13, 2021 4:29 pm

Share
Show comments

Recent Posts

మూడేళ్ళలో పుష్ప 3 సాధ్యమేనా

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…

47 seconds ago

బాహుబలి 1 రీ రిలీజ్ – రికార్డులు గల్లంతే

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…

5 minutes ago

సునీతా సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

44 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

3 hours ago