లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్ లో వందల సంఖ్యలో గీతాలను ఆలపించారు. అక్కడితో ఆగిపోకుండా ‘పాడుతా తీయగా’ అనే షోతో సినిమా ఇండస్ట్రీకి ఎందరో సింగర్స్ ను పరిచయం చేశారు. ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నాయి. ఇందులో పాల్గొనే వారికి ఎస్పీ బాలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రతి పాట.. దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెబుతూ ఆకట్టుకునేవారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ షో బాలు మరణంతో ఆగిపోయింది.
ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనేది అక్షర సత్యం. అందుకే ‘పాడుతా తీయగా’ షోకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ షోకి సంబంధించిన బాధత్యలను రామోజీరావు.. బాలు తనయుడు ఎస్పీ చరణ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ షోని చరణ్ తో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే చరణ్ తో పాటు ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, గాయని సునీతలు కూడా న్యాయనిర్ణేతలుగా ఉంటారట.
ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ‘పాడుతా తీయగా’ షోను కొనసాగించబోతున్నారు. రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎస్పీ బాలు స్థానంలో ఆయన కుమారుడు ఈ షోని ఎంతవరకు రక్తి కట్టించగలరో చూడాలి. మొత్తానికి ఈ న్యూస్ సంగీత ప్రియులకు ఆనందం కలిగించేదనే చెప్పాలి. ఈ షోతో మరింత మంది గాయనీ గాయకులకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం!
This post was last modified on June 4, 2021 7:21 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…