లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్ లో వందల సంఖ్యలో గీతాలను ఆలపించారు. అక్కడితో ఆగిపోకుండా ‘పాడుతా తీయగా’ అనే షోతో సినిమా ఇండస్ట్రీకి ఎందరో సింగర్స్ ను పరిచయం చేశారు. ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నాయి. ఇందులో పాల్గొనే వారికి ఎస్పీ బాలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రతి పాట.. దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెబుతూ ఆకట్టుకునేవారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ షో బాలు మరణంతో ఆగిపోయింది.
ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనేది అక్షర సత్యం. అందుకే ‘పాడుతా తీయగా’ షోకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ షోకి సంబంధించిన బాధత్యలను రామోజీరావు.. బాలు తనయుడు ఎస్పీ చరణ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ షోని చరణ్ తో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే చరణ్ తో పాటు ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, గాయని సునీతలు కూడా న్యాయనిర్ణేతలుగా ఉంటారట.
ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ‘పాడుతా తీయగా’ షోను కొనసాగించబోతున్నారు. రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎస్పీ బాలు స్థానంలో ఆయన కుమారుడు ఈ షోని ఎంతవరకు రక్తి కట్టించగలరో చూడాలి. మొత్తానికి ఈ న్యూస్ సంగీత ప్రియులకు ఆనందం కలిగించేదనే చెప్పాలి. ఈ షోతో మరింత మంది గాయనీ గాయకులకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం!
This post was last modified on June 4, 2021 7:21 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…