లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్ లో వందల సంఖ్యలో గీతాలను ఆలపించారు. అక్కడితో ఆగిపోకుండా ‘పాడుతా తీయగా’ అనే షోతో సినిమా ఇండస్ట్రీకి ఎందరో సింగర్స్ ను పరిచయం చేశారు. ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నాయి. ఇందులో పాల్గొనే వారికి ఎస్పీ బాలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రతి పాట.. దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెబుతూ ఆకట్టుకునేవారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ షో బాలు మరణంతో ఆగిపోయింది.
ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనేది అక్షర సత్యం. అందుకే ‘పాడుతా తీయగా’ షోకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ షోకి సంబంధించిన బాధత్యలను రామోజీరావు.. బాలు తనయుడు ఎస్పీ చరణ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ షోని చరణ్ తో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే చరణ్ తో పాటు ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, గాయని సునీతలు కూడా న్యాయనిర్ణేతలుగా ఉంటారట.
ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ‘పాడుతా తీయగా’ షోను కొనసాగించబోతున్నారు. రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎస్పీ బాలు స్థానంలో ఆయన కుమారుడు ఈ షోని ఎంతవరకు రక్తి కట్టించగలరో చూడాలి. మొత్తానికి ఈ న్యూస్ సంగీత ప్రియులకు ఆనందం కలిగించేదనే చెప్పాలి. ఈ షోతో మరింత మంది గాయనీ గాయకులకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం!
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు…
మొన్న ఏడాది దీపావళి పండక్కు విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమా అమరన్ తెలుగులోనూ మంచి విజయం…
సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక…
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…