టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. 80లు, 90ల్లో ఈవీవీ ఎన్నో సూపర్ హిట్లు అందించాడు. రాఘవేంద్రరావుకు దీటైన కమర్షియల్ డైరెక్టర్గా నిలిచాడు. కెరీర్లో 70 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన ఘనుడాయన. అలాంటి లెజెండరీ డైరెక్టర్.. కెరీర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.
హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి రైల్లో ప్రయాణిస్తూ గోదావరిలో దూకి చనిపోవాలనుకున్నారు. అందుకు మానసికంగా సిద్ధమైపోయిన ఆయన.. చివరి క్షణాల్లో తన కొడుకులు గుర్తుకొచ్చి ఆగిపోయారు.. తాను ఆత్మహత్య చేసుకుంటే కొడుకుల్ని తన భార్య ఎలా చూసుకుంటుంది.. వాళ్ల భవిష్యతేంటి అనుకుని ఆ ఆలోచన మానుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకోవడానికి కారణం.. దర్శకుడిగా అరంగేట్రం చేసిన చెవిలో పువ్వు చిత్రమేనట.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఈవీవీ తీసిన తొలి సినిమా చెవిలో పువ్వు ఫ్లాప్ అయింది. దీంతో ఈవీవీని ఎవ్వరూ పట్టించుకోలేదట. మరో అవకాశం రావడం కష్టమే అనిపించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన.. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన చేశాడు. ఐతే చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ఆయన.. దర్శకుడిగా అవకాశం రాకపోతే మళ్లీ కోడైరెక్టర్గా పని చేసి అయినా బతుకుదాం అనుకున్నారు.
ఐతే ఈవీవీలో ప్రతిభను గుర్తించిన అగ్ర నిర్మాత రామానాయుడు.. ఆయనకు దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చారు. అలా తీసిన చిత్రమే.. ప్రేమఖైదీ. ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈవీవీ కెరీర్ను మార్చింది. ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అల్లరి నరేష్.. తన తండ్రి ఆత్మహత్య వరకు వెళ్లిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on May 17, 2020 12:00 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…