‘రుద్రమదేవి’ సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో రూ.200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే ఎంత కాలమవుతున్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. రానా వేరే ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడం, మరోపక్క గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను అనౌన్స్ చేయడంతో ఇక ‘హిరణ్య కశ్యప’ ఉండదని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని గుణశేఖర్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్, రానా మార్కెట్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని సురేష్ బాబు నిర్మాతగా వెనుకడుగు వేశారట. సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉండడంతో ప్రీప్రొడక్షన్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ.. అక్కడితో ఆగిపోతే మంచిదని భావించి సురేష్ బాబు నిర్మాతగా తప్పుకున్నారని సమాచారం. అందుకే సినిమా పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ తరువాత ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డామని.. కాబట్టి కచ్చితంగా సినిమా చేసి తీరుతామని అంటున్నారు. మరి ఇంతటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో తెలియదు. ఒకవేళ ‘శాకుంతలం’ గనుక మంచి సక్సెస్ అందుకొని భారీ లాభాలను తీసుకొస్తే.. ఎప్పటిలానే ‘హిరణ్య కశ్యప’ సినిమాను కూడా గుణశేఖర్ సొంతంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…