‘రుద్రమదేవి’ సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో రూ.200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే ఎంత కాలమవుతున్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. రానా వేరే ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడం, మరోపక్క గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను అనౌన్స్ చేయడంతో ఇక ‘హిరణ్య కశ్యప’ ఉండదని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని గుణశేఖర్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్, రానా మార్కెట్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని సురేష్ బాబు నిర్మాతగా వెనుకడుగు వేశారట. సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉండడంతో ప్రీప్రొడక్షన్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ.. అక్కడితో ఆగిపోతే మంచిదని భావించి సురేష్ బాబు నిర్మాతగా తప్పుకున్నారని సమాచారం. అందుకే సినిమా పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ తరువాత ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డామని.. కాబట్టి కచ్చితంగా సినిమా చేసి తీరుతామని అంటున్నారు. మరి ఇంతటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో తెలియదు. ఒకవేళ ‘శాకుంతలం’ గనుక మంచి సక్సెస్ అందుకొని భారీ లాభాలను తీసుకొస్తే.. ఎప్పటిలానే ‘హిరణ్య కశ్యప’ సినిమాను కూడా గుణశేఖర్ సొంతంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on June 3, 2021 7:11 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…