‘రుద్రమదేవి’ సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో రూ.200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే ఎంత కాలమవుతున్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. రానా వేరే ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడం, మరోపక్క గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను అనౌన్స్ చేయడంతో ఇక ‘హిరణ్య కశ్యప’ ఉండదని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని గుణశేఖర్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్, రానా మార్కెట్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని సురేష్ బాబు నిర్మాతగా వెనుకడుగు వేశారట. సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉండడంతో ప్రీప్రొడక్షన్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ.. అక్కడితో ఆగిపోతే మంచిదని భావించి సురేష్ బాబు నిర్మాతగా తప్పుకున్నారని సమాచారం. అందుకే సినిమా పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ తరువాత ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డామని.. కాబట్టి కచ్చితంగా సినిమా చేసి తీరుతామని అంటున్నారు. మరి ఇంతటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో తెలియదు. ఒకవేళ ‘శాకుంతలం’ గనుక మంచి సక్సెస్ అందుకొని భారీ లాభాలను తీసుకొస్తే.. ఎప్పటిలానే ‘హిరణ్య కశ్యప’ సినిమాను కూడా గుణశేఖర్ సొంతంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on June 3, 2021 7:11 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…