‘రుద్రమదేవి’ సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో రూ.200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే ఎంత కాలమవుతున్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. రానా వేరే ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడం, మరోపక్క గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను అనౌన్స్ చేయడంతో ఇక ‘హిరణ్య కశ్యప’ ఉండదని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని గుణశేఖర్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్, రానా మార్కెట్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని సురేష్ బాబు నిర్మాతగా వెనుకడుగు వేశారట. సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉండడంతో ప్రీప్రొడక్షన్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ.. అక్కడితో ఆగిపోతే మంచిదని భావించి సురేష్ బాబు నిర్మాతగా తప్పుకున్నారని సమాచారం. అందుకే సినిమా పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ తరువాత ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డామని.. కాబట్టి కచ్చితంగా సినిమా చేసి తీరుతామని అంటున్నారు. మరి ఇంతటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో తెలియదు. ఒకవేళ ‘శాకుంతలం’ గనుక మంచి సక్సెస్ అందుకొని భారీ లాభాలను తీసుకొస్తే.. ఎప్పటిలానే ‘హిరణ్య కశ్యప’ సినిమాను కూడా గుణశేఖర్ సొంతంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on June 3, 2021 7:11 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…