జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సమయం సమీపిస్తోంది. ఇంకో మూడు రోజుల్లో తారక్ జన్మదినం. ఈసారి తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు ఓ రేంజిలో హంగామా చేయాలని అభిమానులు.. తారక్ పీఆర్వో టీం గట్టిగా ఫిక్సయినట్లుంది. ఇంతకుముందే ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డిస్ ప్లే పిక్ లాంచ్ కొన్ని రోజుల కిందట సందడిగా సాగింది.
25 మంది ఫిలిం సెలబ్రెటీలతో ఒకేసారి ఎన్టీఆర్ సీడీపీని రిలీజ్ చేయించారు. మామూలుగా ఇలాంటివి అభిమానులే తయారు చేస్తారు. వాళ్లే సర్క్యులేట్ చేస్తారు. కానీ తారక్ సీడీపీని మాత్రం వాల్స్ అండ్ ట్రెండ్స్ సంస్థతో ప్రత్యేకంగా తయారు చేయించారు. సెలబ్రెటీలను ఇన్వాల్వ్ చేసి దాన్ని లాంచ్ చేయించి హంగామా చేశారు. ఇప్పుడు తారక్ పుట్టిన రోజుకు సంబంధించి కొత్త పోస్టర్లు తయారయ్యాయి.
ఎన్టీఆర్కు తెలుగుతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో శుభాకాంక్షలు చెబుతున్న పోస్టర్లు తయారు చేయించారు. నాలుగు భాషలకు సంబంధించిన పోస్టర్లను హరీష్ శంకర్తో పాటు మరికొందరు ప్రముఖులతో లాంచ్ చేయించారు. జై లవకుశలోని జై పాత్రకు సంబంధించిన చిత్రంతో ఈ పోస్టర్ తయారైంది. నా అభిమానులకు ఏం జరిగినా తట్టుకోలేను.
నా ఒక్కొక్క అభిమాని ఒక్కో వజ్రంతో సమానం అని తారక్ గతంలో చెప్పిన మాటను కోట్ చేయడంతో పాటు.. వివిధ సందర్భాల్లో తారక్ మాటల్ని ఈ పోస్టర్లో చక్కగా పేర్చారు. మొత్తానికి వ్యవహారం చూస్తుంటే ఈ పుట్టిన రోజు నాడు తారక్ క్రేజ్ ఏంటో అందరికీ తెలియజేసే ప్రయత్నం జరుగుతున్నట్లుంది.
అభిమానుల్ని బాగా మోటివేట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఈ ఉత్సాహంలో తారక్ పుట్టని రోజు నాడు అభిమానులు ట్విట్టర్ బర్త్ డే ట్రెండ్స్ రికార్డుల అంతు చూస్తారేమో చూడాలి.
This post was last modified on May 16, 2020 11:19 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…