ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త దర్శకులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లు అందుకున్నారు. నేటి తరానికి నచ్చే విధంగా కథలను రాసుకుంటూ.. తెరపై చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు కూడా చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా బ్యానర్ లు స్థాపించి వాటిపై సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తుంటారు.
చిన్న సినిమాలు ఏవైనా నచ్చితే తన బ్యానర్ లో వాటిని రిలీజ్ చేస్తుంటారు. అలానే కొత్త దర్శకులు చెప్పే కథలు తనకు నచ్చితే గనుక తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి సురేష్ బాబు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే యువకుడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు సురేష్ బాబు.
అయితే సతీష్ చెప్పిన కథలో రానా హీరోగా నటిస్తారా..? లేక కొత్త వాళ్లను తీసుకుంటారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతానికైతే సురేష్ బాబు.. ఈ కొత్త దర్శకుడితో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం సురేష్ బాబు ప్రొడక్షన్స్ పై ‘నారప్ప’, ‘దృశ్యం 2’ అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.
This post was last modified on June 2, 2021 6:07 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…