ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త దర్శకులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లు అందుకున్నారు. నేటి తరానికి నచ్చే విధంగా కథలను రాసుకుంటూ.. తెరపై చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు కూడా చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా బ్యానర్ లు స్థాపించి వాటిపై సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తుంటారు.
చిన్న సినిమాలు ఏవైనా నచ్చితే తన బ్యానర్ లో వాటిని రిలీజ్ చేస్తుంటారు. అలానే కొత్త దర్శకులు చెప్పే కథలు తనకు నచ్చితే గనుక తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి సురేష్ బాబు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే యువకుడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు సురేష్ బాబు.
అయితే సతీష్ చెప్పిన కథలో రానా హీరోగా నటిస్తారా..? లేక కొత్త వాళ్లను తీసుకుంటారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతానికైతే సురేష్ బాబు.. ఈ కొత్త దర్శకుడితో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం సురేష్ బాబు ప్రొడక్షన్స్ పై ‘నారప్ప’, ‘దృశ్యం 2’ అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.
This post was last modified on June 2, 2021 6:07 am
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…