ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త దర్శకులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లు అందుకున్నారు. నేటి తరానికి నచ్చే విధంగా కథలను రాసుకుంటూ.. తెరపై చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు కూడా చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా బ్యానర్ లు స్థాపించి వాటిపై సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తుంటారు.
చిన్న సినిమాలు ఏవైనా నచ్చితే తన బ్యానర్ లో వాటిని రిలీజ్ చేస్తుంటారు. అలానే కొత్త దర్శకులు చెప్పే కథలు తనకు నచ్చితే గనుక తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి సురేష్ బాబు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే యువకుడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు సురేష్ బాబు.
అయితే సతీష్ చెప్పిన కథలో రానా హీరోగా నటిస్తారా..? లేక కొత్త వాళ్లను తీసుకుంటారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతానికైతే సురేష్ బాబు.. ఈ కొత్త దర్శకుడితో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం సురేష్ బాబు ప్రొడక్షన్స్ పై ‘నారప్ప’, ‘దృశ్యం 2’ అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.
This post was last modified on June 2, 2021 6:07 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…