ప్యార్ కా పంచనామా, సోనూ కే టిటు కీ స్వీటీ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్.. ఈ మధ్య ఓ నెగెటివ్ అప్డేట్తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాణంలో ‘దోస్తానా 2’ లాంటి భారీ చిత్రం నుంచి అతను అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అతడిపై 20 రోజులకు పైగా షూటింగ్ జరిపారు. ఐతే స్క్రిప్టు విషయంలో అభ్యంతరాలు చెప్పడం, మరేవో కారణాలతో అతణ్ని ఈ చిత్రం నుంచి సాగనంపేశాడు కరణ్.
సినిమా మధ్యలో ఇలా హీరోను తప్పించడం వల్ల కోట్లు నష్టం వాటిల్లుతున్నప్పటికీ.. కరణ్ తగ్గలేదు. కార్తీక్ తీరు పట్ల ఆయనకు అంతగా కోపం వచ్చింది. అదేదో అనుకోకుండా జరిగిపోయింది, కార్తీక్ ఇక జాగ్రత్తగా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో పెద్ద సినిమా నుంచి అతను బయటికొచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
షారుఖ్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తెరకెక్కుతున్న ‘ఫ్రెడ్డీ’ సినిమాకు కూడా కార్తీక్ ఆర్యన్ దూరమయ్యాడు. ఈ సినిమా నుంచి అతణ్ని తప్పించారా.. తనే బయటికొచ్చేశాడా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలోనూ కార్తీక్ అభ్యంతరాలు చెప్పడంతోనే సాగనంపేశారని అంటున్నారు. సినిమాకు సంతకం చేసేటపుడు అంతా ఓకే అని.. ఇప్పుడు మధ్యలో అభ్యంతరాలు చెప్పడంతో మేకర్స్ అతడికి గుడ్ బై చెప్పేశారంటున్నారు. ఈ సినిమా కోసం తీసుకున్న రూ.2 కోట్ల అడ్వాన్సును అతను వెనక్కి ఇచ్చేశాడట.
ఐతే ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే లాక్ డౌన్ వచ్చి పని ఆపేశారు. దీని వల్ల హీరోను తప్పించడం వల్ల చిత్ర బృందానికి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడతడి స్థానంలో మరో హీరోను తీసుకుని లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇలా స్వల్ప వ్యవధిలో పెద్ద బేనర్లలో తెరకెక్కుతున్న రెండు చిత్రాలకు దూరం కావడం కార్తీక్ కెరీర్కు పెద్ద ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు.
This post was last modified on May 27, 2021 3:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…