సూపర్ స్టార్ మహేష్ బాబు మే 31వ తేదీ ఎంత ప్రత్యేకంగా భావిస్తాడో తెలిసిందే. అది నిన్నటితరం సూపర్ స్టార్, మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాదీ ఆ తేదీన తండ్రికి, తమ కుటుంబ అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వడం మహేష్కు అలవాటు.
ఎక్కువగా కొత్త సినిమాల అనౌన్స్మెంట్, లేదంటే మేకింగ్ దశలో ఉన్న సినిమాల అప్ డేట్స్ ఉండేలా చూసుకుంటాడు మహేష్. ఈ ఏడాది సినిమా కార్యకలాపాలేమీ లేకపోయినా.. ఒక పెద్ద అనౌన్స్మెంట్తో ఆ తేదీని ప్రత్యేకంగా మార్చాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహేష్ కొత్త సినిమా ప్రకటన ఆ రోజే ఉంటుందట. ఆ రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశమున్నట్లు తాజా సమాచారం.
ముందు అనుకున్న ప్రకారమైతే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు నచ్చక ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ఊహించని విధంగా పరశురామ్ లైన్లోకి వచ్చాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ సినిమా కోసం గట్టిగా ప్రయత్నించిన స్టార్ హీరోల్లో మహేష్ ఒకడు. వారి మధ్య కొన్ని రోజులు కథా చర్చలు జరిగాయి.
కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. వంశీ సైడయ్యాక పరశురామ్ను మళ్లీ పిలిపించాడు. కొన్ని సంప్రదింపుల తర్వాత సినిమా ఓకే అయింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను మహేష్తో సినిమా చేయబోతున్నట్లు, అది ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు పరశురామ్ చెప్పిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి 31న మహేష్ అభిమానులు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on May 16, 2020 1:00 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…