సూపర్ స్టార్ మహేష్ బాబు మే 31వ తేదీ ఎంత ప్రత్యేకంగా భావిస్తాడో తెలిసిందే. అది నిన్నటితరం సూపర్ స్టార్, మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాదీ ఆ తేదీన తండ్రికి, తమ కుటుంబ అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వడం మహేష్కు అలవాటు.
ఎక్కువగా కొత్త సినిమాల అనౌన్స్మెంట్, లేదంటే మేకింగ్ దశలో ఉన్న సినిమాల అప్ డేట్స్ ఉండేలా చూసుకుంటాడు మహేష్. ఈ ఏడాది సినిమా కార్యకలాపాలేమీ లేకపోయినా.. ఒక పెద్ద అనౌన్స్మెంట్తో ఆ తేదీని ప్రత్యేకంగా మార్చాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహేష్ కొత్త సినిమా ప్రకటన ఆ రోజే ఉంటుందట. ఆ రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశమున్నట్లు తాజా సమాచారం.
ముందు అనుకున్న ప్రకారమైతే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు నచ్చక ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ఊహించని విధంగా పరశురామ్ లైన్లోకి వచ్చాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ సినిమా కోసం గట్టిగా ప్రయత్నించిన స్టార్ హీరోల్లో మహేష్ ఒకడు. వారి మధ్య కొన్ని రోజులు కథా చర్చలు జరిగాయి.
కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. వంశీ సైడయ్యాక పరశురామ్ను మళ్లీ పిలిపించాడు. కొన్ని సంప్రదింపుల తర్వాత సినిమా ఓకే అయింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను మహేష్తో సినిమా చేయబోతున్నట్లు, అది ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు పరశురామ్ చెప్పిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి 31న మహేష్ అభిమానులు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on May 16, 2020 1:00 am
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…