Movie News

మే 31న పేలిపోయే అనౌన్స్‌మెంట్?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మే 31వ తేదీ ఎంత ప్ర‌త్యేకంగా భావిస్తాడో తెలిసిందే. అది నిన్న‌టిత‌రం సూప‌ర్ స్టార్, మ‌హేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఏడాదీ ఆ తేదీన తండ్రికి, త‌మ కుటుంబ అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వ‌డం మ‌హేష్‌కు అల‌వాటు.

ఎక్కువ‌గా కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్‌, లేదంటే మేకింగ్ ద‌శ‌లో ఉన్న సినిమాల అప్ డేట్స్ ఉండేలా చూసుకుంటాడు మ‌హేష్‌. ఈ ఏడాది సినిమా కార్య‌క‌లాపాలేమీ లేక‌పోయినా.. ఒక పెద్ద అనౌన్స్‌మెంట్‌తో ఆ తేదీని ప్ర‌త్యేకంగా మార్చాల‌ని మ‌హేష్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఆ రోజే ఉంటుంద‌ట‌. ఆ రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తాజా స‌మాచారం.

ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు న‌చ్చ‌క ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ఊహించ‌ని విధంగా ప‌ర‌శురామ్ లైన్లోకి వ‌చ్చాడు. గీత గోవిందం త‌ర్వాత ప‌ర‌శురామ్ సినిమా కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన స్టార్ హీరోల్లో మ‌హేష్ ఒక‌డు. వారి మ‌ధ్య కొన్ని రోజులు క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు క‌ద‌ల్లేదు. వంశీ సైడ‌య్యాక ప‌ర‌శురామ్‌ను మ‌ళ్లీ పిలిపించాడు. కొన్ని సంప్ర‌దింపుల త‌ర్వాత సినిమా ఓకే అయింది. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తాను మ‌హేష్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు, అది ఒక రేంజ్‌లో ఉండ‌బోతున్న‌ట్లు ప‌ర‌శురామ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. మ‌రి 31న మ‌హేష్ అభిమానులు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on May 16, 2020 1:00 am

Share
Show comments
Published by
Satya
Tags: Mahesh Babu

Recent Posts

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

21 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

4 hours ago