సూపర్ స్టార్ మహేష్ బాబు మే 31వ తేదీ ఎంత ప్రత్యేకంగా భావిస్తాడో తెలిసిందే. అది నిన్నటితరం సూపర్ స్టార్, మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాదీ ఆ తేదీన తండ్రికి, తమ కుటుంబ అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వడం మహేష్కు అలవాటు.
ఎక్కువగా కొత్త సినిమాల అనౌన్స్మెంట్, లేదంటే మేకింగ్ దశలో ఉన్న సినిమాల అప్ డేట్స్ ఉండేలా చూసుకుంటాడు మహేష్. ఈ ఏడాది సినిమా కార్యకలాపాలేమీ లేకపోయినా.. ఒక పెద్ద అనౌన్స్మెంట్తో ఆ తేదీని ప్రత్యేకంగా మార్చాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహేష్ కొత్త సినిమా ప్రకటన ఆ రోజే ఉంటుందట. ఆ రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశమున్నట్లు తాజా సమాచారం.
ముందు అనుకున్న ప్రకారమైతే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు నచ్చక ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ఊహించని విధంగా పరశురామ్ లైన్లోకి వచ్చాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ సినిమా కోసం గట్టిగా ప్రయత్నించిన స్టార్ హీరోల్లో మహేష్ ఒకడు. వారి మధ్య కొన్ని రోజులు కథా చర్చలు జరిగాయి.
కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. వంశీ సైడయ్యాక పరశురామ్ను మళ్లీ పిలిపించాడు. కొన్ని సంప్రదింపుల తర్వాత సినిమా ఓకే అయింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను మహేష్తో సినిమా చేయబోతున్నట్లు, అది ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు పరశురామ్ చెప్పిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి 31న మహేష్ అభిమానులు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on May 16, 2020 1:00 am
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…